News November 28, 2025
కామారెడ్డి: జాగృతి చీఫ్ కవిత నేటి షెడ్యూల్

KMR జిల్లాలో శుక్రవారం తెలంగాణ జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత పర్యటించనున్నారు. హోటల్ అమృత గ్రాండ్లో ఉదయం 10 గంటలకు మీడియా సమావేశంలో పాల్గొంటారు. అనంతరం అక్కడే 11 గంటలకు విద్యావంతులు, మేధావులతో సమావేశం నిర్వహిస్తారు. 12 గంటలకు కామారెడ్డి పట్టణ వరద భాదిత కాలనీ సందర్శిస్తారు. 2:30 గంటలకు జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని సందర్శిస్తారు. 4:30 గంటలకు భిక్కనూర్ సిద్ధి రామేశ్వర ఆలయాన్ని దర్శించుకుంటారు.
Similar News
News November 28, 2025
వర్ని: సర్పంచ్ ఎలక్షన్స్.. రెండు చోట్ల ఏకగ్రీవ తీర్మానం

నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని సిద్దాపూర్ తండా, చెలక తండా గ్రామపంచాయతీల సర్పంచ్ ఎన్నికల్లో ఒక్కొక్కరే నామినేషన్ వేయాలని స్థానికులు తీర్మానం చేశారు. గ్రామాల అభివృద్ధికి, ఐక్యతకు నిదర్శనంగా ఏకగ్రీవంగా ఎన్నికలు చేసుకోవాలని తీర్మానించారు. సిద్దాపూర్ సర్పంచ్ అభ్యర్థిగా బాల్సింగ్, చెలక తండా సర్పంచ్ అభ్యర్థిగా గంగారాం మాత్రమే నామినేషన్లు దాఖలు చేయాలని వారు నిర్ణయించుకున్నారు.
News November 28, 2025
NTR: న్యాయం కోసం వస్తే.. అసభ్య ప్రవర్తన

విజయవాడకు చెందిన న్యాయవాదిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు జిల్లాకు చెందిన గిరిజన మహిళ కుటుంబ కలహాల నేపథ్యంలో మున్సిపల్ ఎంప్లాయిస్ కాలనీలోని ఓ న్యాయవాది వద్దకు వచ్చి తన బాధ చెప్పుకుంటుండగా ఆయన సదరు మహిళపై అసభ్యంగా ప్రవర్తించాడు. పలుమార్లు అసభ్యంగా ప్రవర్తించడంతో విసుగు చెందిన మహిళ మాచవరం పోలీసులకు గురువారం ఫిర్యాదు చేయగా ఎస్సై శంకరరావు కేసు నమోదు చేశారు.
News November 28, 2025
HYD: తెలుగు వర్సిటీ..”SPTU-B” ఘన విజయం

సూరవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీలో సౌత్ జోన్ ఎంపికలలో భాగంగా నిర్వహించిన T20 మ్యాచ్లో ‘SPTU-A’ జట్టుపై ‘SPTU-B’ 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన SPTU-B జట్టు 20 ఓవర్లలో 195/7 పరుగులు చేయగా.. వాసు 52 పరుగులు, 4 వికెట్లు తీసి జట్టు విజయానికి కీలక పాత్ర పోషించాడు. SPTU-A 17.2 ఓవర్లకే 165 పరుగులు చేసి ఆలౌట్ అయింది. గెలుపొందిన జట్టుకు వీసీ, రిజిస్ట్రార్ అభినందనలు తెలిపారు.


