News November 28, 2025
బాపట్ల జిల్లాపై తుఫాన్ ప్రభావం..!

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో బాపట్ల జిల్లాలో ఈనెల 29 నుంచి మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కలెక్టర్ కార్యాలయం గురువారం ఓ మ్యాప్ విడుదల చేసింది. తుఫాన్ ప్రభావం వలన ఈదురు గాలులుతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. పంటల విషయంలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.
Similar News
News November 28, 2025
కుప్పంలో రూ.305 కోట్లతో ACE యూనిట్

AP: పాడి ఉత్పత్తుల సంస్థ ACE ఇంటర్నేషనల్ చిత్తూరు జిల్లా కుప్పంలో భారీ యూనిట్ను ఏర్పాటుచేయనుంది. ఆసియాలోనే తొలిసారి అత్యాధునిక డెయిరీ న్యూట్రీషన్ ప్రాసెసింగ్ టెక్నాలజీని ఉపయోగించనుంది. ఇందుకోసం రూ.305 కోట్లు వెచ్చించనుంది. ఈ ప్లాంట్లో చిన్నపిల్లలు, పెద్దల ఆరోగ్యం, పోషణకు దోహదం చేసే ఉత్పత్తులను తయారుచేసి దేశ విదేశాలకు ఎగుమతి చేయనుంది.
News November 28, 2025
SVUలో ర్యాగింగ్.. హైకోర్టు కీలక తీర్పు

SVU సైకాలజీ డిపార్ట్మెంటులో జూనియర్లపై HOD ఆదేశాలతో సీనియర్లు <<18239778>>ర్యాగింగ్<<>> చేయగా.. అప్పట్లో విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. దీనిపై వర్సిటీ అధికారులు విద్యార్థి సంఘాలపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులను కొట్టివేయాలని పరిశోధక విద్యార్థి అశోక్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఘటనపై విచారం వ్యక్తం చేసిన కోర్టు వర్సిటీ అధికారులకు నోటీసులు పంపమని ఆదేశించినట్లు అశోక్ పేర్కొన్నారు.
News November 28, 2025
సిద్దిపేట: జిల్లాలో తొలి సర్పంచ్ ఏకగ్రీవం !

పంచాయతీ ఎన్నికల నామినేషన్ తొలిరోజే జగదేవ్పూర్ మండలం, బిజీ వెంకటాపూర్ సర్పంచ్ పదవి ఏకగ్రీవమైంది. చెక్కల పరమేశ్వర్ పోటీ లేకుండానే సర్పంచ్గా ఎన్నికయ్యారు. గ్రామాభివృద్ధికి పరమేశ్వర్ నాయకత్వమే సరైనదని నమ్మిన గ్రామస్థులు, ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.


