News November 28, 2025
మేడారంలో వనదేవతల దర్శనానికి 8 క్యూలైన్లు: ములుగు ఎస్పీ

మేడారం వనదేవతల దర్శనానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా అదనంగా మరో ఐదు క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నామని ములుగు ఎస్పీ సుధీర్ కేకన్ తెలిపారు. మొత్తం ఎనిమిది క్యూలైన్ల ద్వారా భక్తులను గద్దెల వద్దకు అనుమతిస్తామన్నారు. 3 గేట్ల ద్వారా బయటకు పంపిస్తామని తెలిపారు. ఈసారి మహా జాతరకు 1.50 కోట్ల మంది తరలివస్తారని అంచనా వేస్తున్నామన్నారు. తల్లుల దర్శనానికి అందరికీ ఒకటే నిబంధన అమలు చేస్తామన్నారు.
Similar News
News November 28, 2025
నెల్లూరు: విలీనం.. ఆదాయానికి గండే..!

నెల్లూరు జిల్లాలో మైకా, క్వార్ట్జ్, గ్రావెల్ వంటి ఖనిజ సంపద, అలాగే షార్, నేలపట్టు, వెంకటగిరి చేనేత వస్త్రాలు వంటి పర్యాటక ప్రాంతాలు తిరుపతి జిల్లాలో కలిసిపోయాయి. దీని వలన నెల్లూరు జిల్లాకు ఖనిజాలు, పర్యాటకం రూపంలో వచ్చే ఆదాయ వనరులు తరలిపోయాయి. ఇక నెల్లూరుకు కృష్ణపట్నం పోర్టు, రొట్టెల పండుగ మాత్రమే మిగలడం జిల్లా మనుగడకే సవాలుగా మారుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది.
News November 28, 2025
ఎన్నికల నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేస్తాం: ఎస్పీ నరసింహ

సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో ఎన్నికల నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేస్తామని ఎస్పీ నరసింహ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో అసత్య, విద్వేషపూరిత పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మద్యం, డబ్బు రవాణాపై నిఘా పెంచామని, అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు నిర్వహించరాదని ఆయన సూచించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
News November 28, 2025
సుల్తానాబాద్లో డివైడర్ నిర్మాణం చేపట్టాలి: కలెక్టర్

PDPL కలెక్టర్ కోయ శ్రీహర్ష రోడ్డు ప్రమాదాల తగ్గింపుపై సమీక్ష నిర్వహిస్తూ, పట్టణాల్లో రోడ్లపై తిరిగే పశువులను తొలగించేందుకు మున్సిపల్-పశుసంవర్ధక శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. బ్లాక్ స్పాట్ల వద్ద రేడియం బోర్డులు, రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు, సుల్తానాబాద్లో డివైడర్ నిర్మాణం చేపట్టాలని సూచించారు. మైనర్లు ఆటోలు నడిపే అంశాన్ని కఠినంగా పర్యవేక్షించాలని, అంతర్గత రోడ్ల మరమ్మతు పూర్తి చేయాలన్నారు.


