News November 28, 2025

విషపు ఎరలతో కీరదోసలో పండు ఈగ నివారణ

image

కీరదోసను ఆశించే పండు ఈగలు పువ్వు మొగ్గలపై, లేత పిందెలపైన గుడ్లు పెడతాయి. వీటి నుంచి వచ్చే పిల్ల పురుగులు కాయను తొలచి, లోపలి గుజ్జును తింటాయి. దీని వల్ల కాయలు కుళ్లిపోతాయి. వీటి కట్టడికి 10 లీటర్ల నీటిలో మలాథియాన్‌ 100ml, బెల్లం 100 గ్రాములను కలిపి మట్టి గిన్నెలో పోసి ఎకరాకు 10-12 చోట్ల ఉంచాలి. దీనిలో పులిసిన కల్లు మడ్డి కలిపితే తల్లి పండు ఈగలు మరింత ఆకర్షింపబడి ఈ విషపదార్థాన్ని తిని చనిపోతాయి.

Similar News

News November 28, 2025

ఎన్నికలను రద్దు చేయాలి: ఆర్.కృష్ణయ్య

image

TG: స్థానిక సంస్థల ఎన్నికలను రద్దు చేయాలని BC నేత, రాజ్యసభ MP ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. HYD గన్ పార్క్ వద్ద BC సంఘాలతో కలిసి ఆయన ఆందోళన చేపట్టారు. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన జీవో <<18403510>>46<<>>ను రద్దు చేసి జీవో9ను పునరుద్ధరించాలని అన్నారు. లేదంటే బీసీల తడాఖా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. BCలకు 42% రిజర్వేషన్లు కేటాయించకపోవడంపై బీసీ సంఘాలు నిరసన తెలుపుతున్న సంగతి తెలిసిందే.

News November 28, 2025

ఎన్నికలను రద్దు చేయాలి: ఆర్.కృష్ణయ్య

image

TG: స్థానిక సంస్థల ఎన్నికలను రద్దు చేయాలని BC నేత, రాజ్యసభ MP ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. HYD గన్ పార్క్ వద్ద BC సంఘాలతో కలిసి ఆయన ఆందోళన చేపట్టారు. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన జీవో <<18403510>>46<<>>ను రద్దు చేసి జీవో9ను పునరుద్ధరించాలని అన్నారు. లేదంటే బీసీల తడాఖా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. BCలకు 42% రిజర్వేషన్లు కేటాయించకపోవడంపై బీసీ సంఘాలు నిరసన తెలుపుతున్న సంగతి తెలిసిందే.

News November 28, 2025

వరిలో జింక్ లోపం, కాండం తొలిచే పురుగు నివారణ

image

☛ వరి పంట మొక్క ఆకుల మీద ఇటుక రంగు మచ్చలు కనిపిస్తే జింక్ లోపంగా భావించాలి. జింక్ లోప నివారణకు లీటరు నీటికి 2 గ్రా. చొప్పున జింక్ సల్ఫేట్ కలిపి 5 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి.
☛ వరిలో కాండం తొలిచే పురుగు/మొగి పురుగు నివారణకు 20-25 కిలోల ఇసుకలో కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4జి గుళికలు 8 కిలోలు లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.4జి గుళికలు 4 కిలోల చొప్పున కలిపి బురద పదునులో వేయాలి.