News November 28, 2025
కర్నూలు: మంటలు అంటుకొని బాలుడి మృతి…!

స్నానానికి వేడి నీరు తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని పెద్దకడబూరుకు చెందిన వడ్డే ప్రవీణ్ కుమార్(6) మృతి చెందినట్లు ఎస్ఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ నెల 11న ఘటన జరగగా చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితికి విషమించడంతో కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News December 1, 2025
అల్లూరి జిల్లాలో ఈనెల 7న ఎన్ఎంఎంఎస్ పరీక్ష

ఈనెల 7న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష జరుగుతుందని DEO బ్రహ్మాజీరావు తెలిపారు. ఈ పరీక్షకు జిల్లా నుంచి 726మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. పాడేరు, చింతపల్లి, రంపచోడవరం, వీఆర్ పురం, చింతూరులో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుందని చెప్పారు. పాఠశాల లాగిన్, మనమిత్ర వాట్సాప్లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు.
News December 1, 2025
HNK: రూ.15 వేలు అకౌంట్లో పడ్డాయా..!

మొంథా తుఫాన్ కారణంగా నష్టపోయిన వరద బాధితులకు ఇంటికి రూ.15 వేల చొప్పున ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి వరంగల్లో ప్రకటించి నెల రోజులు దాటింది. HNK అమరావతినగర్, సమ్మయ్యనగర్, TV టవర్, WGL రామన్నపేట, NTR నగర్ లాంటి ప్రాంతాల్లో వరద ముంపునకు గురైన 6,500 ఇళ్లకు రూ.15 వేల చొప్పున ఇస్తామని ప్రకటించారు. ఇందుకు రూ.12 కోట్లను విడుదల చేశారని చెప్తున్నా, ఇప్పటి వరకు అకౌంట్లో డబ్బులు జమ కాలేదని బాధితులంటున్నారు.
News December 1, 2025
కృష్ణా: పరీక్షల రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల

కృష్ణా యూనివర్సిటీ (KRU) పరిధిలోని కళాశాలల్లో SEP 2025లో నిర్వహించిన BA.LLB 2,6వ సెమిస్టర్ (2025-26 అకడమిక్ ఇయర్) పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు DEC 8లోపు ఒక్కో పేపరుకు రూ. 900 ఫీజు ఆన్లైన్లో http://www.onlinesbi.com/ చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగం సూచించింది.


