News April 17, 2024
శ్రీకాకుళం: అప్పులు బాధ తాళలేక ఆత్మహత్య

నియోజకవర్గ పరిధి రూరల్ మండలం ఒప్పంగి గ్రామానికి చెందిన మంత్రి శ్రీధర్ (38) అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు నిర్ధారించారు. మునసబుపేట సమీపంలోగల ఓ లేఅవుట్ వద్ద మృతి చెందిన విషయాన్ని స్థానికులు ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. రూరల్ ఎస్సై ఎం.వాసుదేవరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News October 8, 2025
శ్రీకాకుళం: ‘మరో మూడు గంటలు..సురక్షిత ప్రదేశాల్లో ఉండండి’

శ్రీకాకుళం జిల్లాలోని మరో మూడు గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చిరికలు జారీ చేసింది. ఈ వానలు ఇచ్ఛాపురం, సోంపేట, టెక్కలి, శ్రీకాకుళం, నరసన్నపేట పరిసర ప్రాంతాల్లో పడతాయని చెప్పారు. పిడుగులతో పాటు 40-50 కి.మీ ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలెవ్వరూ బహిరంగ ప్రదేశాలు, చెట్ల కింద ఉండవద్దని కలెక్టరేట్ నుంచి ఓ ప్రకటన వెలువడింది.
News October 8, 2025
పొందూరు : రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

పొందూరు మండలం తుంగపేట సమీపంలో రైల్వే గేటు వద్ద గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించినట్లు జీఆర్పీ హెచ్సీ మధుసూదనరావు బుధవారం తెలిపారు. మృతుని వయస్సు 35 సంవత్సరాలు ఉండి గడుల కలర్ చొక్కా ధరించినట్లు తెలిపారు. రైలు ప్రయాణం చేస్తున్న సమయంలో రైలు నుంచి జారిపడి మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
News October 8, 2025
కొత్తూరు: కేజీబీవీ ప్రిన్సిపల్, అకౌంటెంట్లపై వేటు

కొత్తూరు కస్తూరి భా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) ప్రిన్సిపల్ రాధిక, అకౌంటెంట్ శ్రీదేవిలను విధుల నుంచి తొలగిస్తూ సమగ్ర శిక్ష ఏపీసీ ఎస్ శశిభూషణ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేజీబీవీని కొత్తూరు తహశీల్దార్ బాలకృష్ణ ఇటీవల ఆకస్మిక తనిఖీ చేశారు. ఆ సమయంలో రికార్డులో 248 కిలోల బియ్యం మిగిలి ఉన్నట్లు నమోదు చేశారు. వాస్తవానికి 1,400 కిలోల బియ్యం మిగిలి ఉన్నాయి. దీంతో వారిపై వేటు పడింది.