News April 17, 2024

HYD: శ్రీరామ శోభాయాత్రలో దొంగల బీభత్సం

image

శ్రీరామ శోభాయాత్రలో దొంగలు చేతివాటం చూపించారు. పలువురు భక్తుల నుంచి సెల్‌ఫోన్లు, ఆభరణాలు అపహరించారు. దాదాపు 16 సెల్‌ఫోన్లు, 3 బంగారు గొలుసులు, ఒక బ్రాస్‌లెట్ చోరీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో బాధితులు పాతబస్తీ మంగళ్‌హాట్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.

Similar News

News April 22, 2025

సివిల్స్ ర్యాంక్ కొట్టిన షాద్‌నగర్ యువతి

image

UPSCలోనూ మన రంగారెడ్డి జిల్లా వాసులు రాణించారు. షాద్‌నగర్‌లోని టీచర్స్‌కాలనీకి చెందిన రాఘవేందర్ రావు కుమార్తె ఇంద్రార్చిత కొంతకాలంగా సివిల్స్‌‌‌కు ప్రిపేర్ అవుతోంది. తాజాగా విడుదలైన UPSC ఫలితాల్లో 739 ర్యాంక్ సాధించింది. పట్టుదలతో చదివి ర్యాంక్ సాధించడం పట్ల షాద్‌నగర్ వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఆల్ ఇండియాలో రంగారెడ్డి జిల్లా యువత మెరుగైన ఫలితాలు సాధించడం విశేషం.

News April 22, 2025

HYD: మన జిల్లాలకు వచ్చిన ర్యాంకుల వివరాలు

image

ఇంటర్ ఫస్టియర్‌లో..
మేడ్చల్ 77.21 శాతంతో స్టేట్ 1వ ర్యాంక్
రంగారెడ్డి 76.36 శాతంతో స్టేట్ 2వ ర్యాంక్
హైదరాబాద్‌ 66.68 స్టేట్ 7వ ర్యాంక్
వికారాబాద్ 61.31 స్టేట్ 12వ ర్యాంక్
ఇంటర్ సెకండియర్‌లో..
మేడ్చల్ 77.91 శాతంతో స్టేట్ 3వ ర్యాంక్
రంగారెడ్డి 77.53 శాతంతో స్టేట్ 4వ ర్యాంక్
వికారాబాద్ 68.20 స్టేట్ 21వ ర్యాంక్
హైదరాబాద్‌ 67.74 స్టేట్ 23వ ర్యాంక్

News April 22, 2025

రంగారెడ్డి: రైతు బిడ్డకు ఇంటర్‌లో TOP RANK

image

రంగారెడ్డి జిల్లాకు చెందిన రైతుబిడ్డ తెలంగాణ ఇంటర్‌ ఫస్టియర్‌లో టాపర్‌గా నిలిచింది. ఇబ్రహీంపట్నం మం. పోచారానికి చెందిన నగేశ్ గౌడ్-సబిత దంపతుల కూతురు శ్రీవార్షిక MPCలో 470 మార్కులకు 468 మార్కులు సాధించింది. ఇంగ్లిష్, సంస్కృతంలోనే ఒక్కో మార్కు రాలేదు. మిగతా అన్ని సబ్జెక్టుల్లో ఫుల్ మార్క్స్ వచ్చాయి. ఇంటర్ మొదటి సంవత్సరంలో తెలంగాణ స్టేట్ టాప్ ర్యాంకర్‌గా రైతు బిడ్డ నిలవడం గర్వకారణం.
SHARE IT

error: Content is protected !!