News November 28, 2025

చింతపల్లి: చిలకడదుంపలకు పెరిగిన గిరాకీ

image

చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాల్లో సాగవుతున్న చిలకడ దుంపలకు ఈ ఏడాది గిరాకీ ఏర్పడింది.
ఈ రెండు మండలాల్లో 200 ఎకరాల్లో ఈ పంట సాగావుతోంది. ఎకరాకు ₹25,000 పెట్టుబడి పెడితే ఖర్చులు పోను రూ.25000 ఆదాయం వస్తోందని అంటున్నారు. గతఏడాది బస్తా (80kg) రూ.800 కాగా ఈ ఏడాది రూ.1200కు పెరిగింది. దీనితో గిరి రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. ఇక్కడ పండిన పంట రాజమండ్రి, విజయవాడ, బెంగుళూరు మార్కెట్లకు వెళుతోంది.

Similar News

News November 28, 2025

NZB: రెండో రోజు 450 నామినేషన్లు

image

నిజామాబాద్ జిల్లాలో మొదటి విడతలో జరగనున్న GP ఎన్నికల్లో రెండో రోజు శుక్రవారం 184 సర్పంచి స్థానాలకు 164 నామినేషన్లు, 1,642 వార్డు మెంబర్ల స్థానాలకు 286 నామినేషన్లు దాఖలు అయినట్లు అధికారులు వెల్లడించారు. మొదటి విడతలో బోధన్, చందూర్, కోటగిరి, మోస్రా, పొతంగల్, రెంజల్, రుద్రూర్, సాలుర, ఎడపల్లి, నవీపేట మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి.

News November 28, 2025

భువనగిరి: ఆర్టీసీ బస్సు ఢీకొని రైతు మృతి

image

ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం పోయిన ఘటన భువనగిరి మండల పరిధిలో జరిగింది. కుమ్మరిగూడెంకు చెందిన లక్ష్మయ్య అనే రైతు పొలం వద్దకు నడుచుకుంటూ వెళ్తుండగా, హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News November 28, 2025

వరంగల్: కాళోజీ ఉపకులపతిపై వేటు..?

image

కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నందకుమార్ రెడ్డిపై వేటు వేసినట్టు తెలిసింది. కాళోజీ వర్సిటీ వ్యవహారాలపై వరుస కథనాలు Way2Newsలో రావడంతో ఇంటెలిజెన్సు రిపోర్టును సీఎం కోరారు. నిఘా సంస్థలు ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రాథమికంగా వీసీని తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఇప్పటికే సీఎంవోకు సమగ్ర నివేదిక అందడంతో వేటు పడినట్టు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.