News November 29, 2025

పార్వతీపురం: గిరిజన పీజీఆర్‌ఎస్‌కి 26 వినతులు

image

గిరిజన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 26 వినతులు అందినట్లు జాయింట్ కలెక్టర్, ఐటీడిఏ ప్రాజెక్ట్ అధికారి సి.యశ్వంత్ కుమార్ రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక ఐటీడిఏ గిరిమిత్ర హాలులో గిరిజన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం పీవో సమక్షంలో జరిగింది. గిరిజనుల వ్యక్తిగత, సామాజిక, అభివృద్ధి సంబంధిత సమస్యలను నేరుగా సంబంధిత శాఖల అధికారుల సమక్షంలో ఉంచి పరిష్కారం పొందేలా చూడాలన్నారు.

Similar News

News December 4, 2025

భారతీయుడికి జాక్‌పాట్.. లాటరీలో రూ.61కోట్లు!

image

సౌదీలో ఉంటున్న భారతీయుడు PV రాజన్‌కు ‘బిగ్ టికెట్ డ్రా సిరీస్ 281’లో జాక్‌పాట్ తగిలింది. అబుధాబిలో లక్కీ డ్రా తీయగా NOV 9న అతను కొనుగోలు చేసిన లాటరీ టికెట్-282824 నంబరుకు 25M దిర్హమ్స్(రూ.61.37కోట్లు) వచ్చాయి. ఓ కంపెనీలో క్వాలిటీ కంట్రోల్ సూపర్‌వైజర్‌గా పని చేసే రాజన్ 15ఏళ్లుగా లాటరీ టికెట్ కొంటున్నారు. గత నెల కూడా ‘బిగ్ టికెట్’ లక్కీ డ్రాలో TNకు చెందిన వెంకటాచలం విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.

News December 4, 2025

తిరుపతి: డ్రంక్ అండ్ డ్రైవ్.. భారీ జరిమానా

image

తిరుపతి పట్టణంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన 31 మంది డ్రైవర్లకు 3వ అదనపు మేజిస్ట్రేట్ సంధ్యారాణి బుధవారం రూ.3,10,000 జరిమానా విధించారు. ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున జరిమానా విధించినట్లు ట్రాఫిక్ DSP రామకృష్ణ చారి తెలిపారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన 25 మందికి రూ.500 చొప్పున రూ.12,500 జరిమానా విధించినట్లు తెలిపారు.

News December 4, 2025

జూనియర్ లెక్చరర్ల పరీక్ష ఫలితాలు విడుదల

image

AP: జూనియర్ లెక్చరర్ల రాత పరీక్ష ఫలితాలను APPSC విడుదల చేసింది. ఇక్కడ <>క్లిక్<<>> చేసి రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 16, 17 తేదీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని చెప్పింది. అదే రోజు కంప్యూటర్ బేస్డ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తామని వెల్లడించింది. కాల్ లెటర్లు రానివారు అధికారిక వెబ్ సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. జులై 15-23 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.