News November 29, 2025

పార్వతీపురం: గిరిజన పీజీఆర్‌ఎస్‌కి 26 వినతులు

image

గిరిజన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 26 వినతులు అందినట్లు జాయింట్ కలెక్టర్, ఐటీడిఏ ప్రాజెక్ట్ అధికారి సి.యశ్వంత్ కుమార్ రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక ఐటీడిఏ గిరిమిత్ర హాలులో గిరిజన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం పీవో సమక్షంలో జరిగింది. గిరిజనుల వ్యక్తిగత, సామాజిక, అభివృద్ధి సంబంధిత సమస్యలను నేరుగా సంబంధిత శాఖల అధికారుల సమక్షంలో ఉంచి పరిష్కారం పొందేలా చూడాలన్నారు.

Similar News

News December 3, 2025

ఎచ్చెర్ల: మహిళ హత్య?

image

ఎచ్చెర్ల మండలం కేశవరావుపేట జాతీయ రహదారి పక్కన మంగళవారం రాత్రి మహిళ హత్యకు గురైనట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని మృతికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. ఎస్సై లక్ష్మణరావు ఆధ్వర్యంలో క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ వచ్చి పరిశీలన జరుపుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News December 3, 2025

పాలమూరు: రెబల్ అభ్యర్థుల నామినేషన్ ఉపసంహరణ కోసం పడరాని పాట్లు

image

పాలమూరు జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రెబల్ అభ్యర్థుల ఉపసంహరణ కోసం వివిధ పార్టీల నాయకులు పడరాని పాట్లు పడుతున్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు చెందిన రెబల్ అభ్యర్థులు బరిలో నిలవడంతో, ఓట్లు చీలిపోకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉపసంహరణకు నేడే చివరి రోజు కావడంతో, రెబల్ అభ్యర్థులను ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు సమాచారం.

News December 3, 2025

వరుసగా రెండో రోజూ పతనం.. 90 దాటిన రూపాయి

image

భారత రూపాయి వరుసగా రెండో రోజూ పతనమైంది. డాలరుతో రూపాయి మారకం విలువ 90.13కు చేరింది. మంగళవారం అత్యంత కనిష్ఠంగా 89.94 వద్దకు చేరిన రూపాయి నేడు మరింత బలహీనపడింది. 2025లో ఇప్పటివరకు 5 శాతానికిపైగా పతనమైంది. USతో ట్రేడ్‌డీల్‌పై అనిశ్చితి, ఈక్విటీల్లోంచి విదేశీ నిధుల ఉపసంహరణ, బంగారం సహా దిగుమతులకు డిమాండ్, ఇన్వెస్టర్లు షార్ట్ కవరింగ్ చేస్తుండటం రూపాయిపై ఒత్తిడి పెంచుతోందని విశ్లేషకులు తెలిపారు.