News April 18, 2024
గుంటూరులో భారీగా నగదు, మద్యం సీజ్

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బుధవారం జిల్లాలో ప్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తాడికొండ నియోజకవర్గ పరిధిలో సరైన పత్రాలు చూపని రూ రూ.80వేల నగదు సీజ్ చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఎన్నికల నేపథ్యంలో జరిగిన తనిఖీలలో ఏప్రిల్ 17వ తేది సాయంత్రం 6 గంటల వరకు రూ.2,19,14,430లక్షల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను సీజ్ చేసినట్లు తెలిపారు.
Similar News
News October 26, 2025
గుంటూరు GMCలో మొంథా తుఫాన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు

‘మొంథా’ తుఫాన్ నేపథ్యంలో గుంటూరు నగరంలో తలెత్తే సమస్యలపై ఫిర్యాదుల కోసం జీఎంసీ కార్యాలయంలో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదివారం తెలిపారు. కంట్రోల్ రూమ్ నంబర్ 0863-2345103, వాట్సాప్ నంబర్ 9849908391ను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఈ నంబర్లకు ఫోన్ చేసి సహాయం పొందాలని కోరారు.
News October 26, 2025
GNT: రైతుల గుండెల్లో తుఫాన్ గుబులు..!

తుపాను హెచ్చరికలతో రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే అధిక వర్షాలతో డెల్టాలోని రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు తుపాను ప్రభావంతో ఈదురు గాలులు, అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో అన్నదాతల గుండెల్లో గుబులు మొదలైంది. గుంటూరు జిల్లాలో ప్రస్తుతం వరి పైరు ఏపుగా పెరుగుతోంది. ఈ సమయంలో తుఫాను వస్తే పంట నీట మునిగి ఎందుకూ పనికి రాదని రైతులు భయపడుతున్నారు.
News October 26, 2025
తుపాన్ హెచ్చరికలు.. PGRS రద్దు: కలెక్టర్

మెంథా తుపాన్ దృష్ట్యా సోమవారం నిర్వహించాల్సిన పీజీఆర్ఎస్ను రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని ఇళ్ల వద్దనే ఉండాలన్నారు. ఈ విషయాన్ని గమనించి అధికారులకు సహకరించాలని కలెక్టర్ కోరారు.


