News November 29, 2025
రేపు విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు: ఎస్ఈ

డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఈనెల 30 (ఆదివారం) సెలవు రోజయినప్పటికీ, విద్యుత్ బిల్లులు యథావిధిగా కట్టించుకోనున్నట్లు ట్రాన్స్కో ఎస్ఈ రాజేశ్వరి తెలిపారు. జిల్లాలోని అన్ని విద్యుత్ రెవెన్యూ కార్యాలయాలు, సెక్షన్ ఆఫీస్ కౌంటర్లు, ఏటీపీ కేంద్రాలు పనిచేస్తాయన్నారు. విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, బిల్లులను చెల్లించాలని ఆమె శనివారం కోరారు.
Similar News
News January 6, 2026
డబ్బులివ్వకుంటే సిబ్బందికి జీతాలెలా: KRMB

AP, TG ప్రభుత్వాల తీరుపై కృష్ణానదీ యాజమాన్య బోర్డు (KRMB) అసంతృప్తి వ్యక్తం చేసింది. గత 3 త్రైమాసికాలుగా బోర్డుకు నిధులు విడుదల చేయకపోవడంపై ఆగ్రహించింది. FY25-26లో ఎలాంటి నిధులూ ఇవ్వకపోవడంపై 2 రాష్ట్రాల ఇరిగేషన్ ENCలకు లేఖ రాసింది. సిబ్బందికి జీతాలు చెల్లించడంలో ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొంది. కాగా టెలిమెట్రీ ఫేజ్2 కోసం TG అందించిన రూ.4.15CRను మళ్లించి సిబ్బందికి జీతాలు చెల్లిస్తున్నారు.
News January 6, 2026
ఓటర్ల జాబితాపై అభ్యంతరాలకు 8 వరకు గడువు: కలెక్టర్

పరకాల మున్సిపాలిటీ ఓటర్ల ముసాయిదా జాబితాపై ఏవైనా అభ్యంతరాలుంటే ఈ నెల 8లోగా సమర్పించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. తప్పులు లేని పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపొందించడమే యంత్రాంగం లక్ష్యమని స్పష్టం చేశారు. ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పుల ప్రక్రియకు రాజకీయ పార్టీలు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు.
News January 6, 2026
యాదాద్రి భువనగిరి కలెక్టర్.. గొప్ప మనసు

దత్త విద్యార్థి భరత్ చంద్ర కుటుంబానికి 200 గజాల ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేస్తూ ఇంటి పట్టాను కలెక్టర్ హనుమంతరావు మంగళవారం అందజేశారు. నారాయణపురం మండలం శేరిగూడెం గ్రామానికి చెందిన దత్త విద్యార్థి భరత్ చంద్ర చారి కుటుంబానికి మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులతో పాటు రూ.5000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గతంలో కలెక్టర్ ఇచ్చిన హామీ ప్రకారం.. 200 గజాల స్థలం పట్టాను అందజేశారు.


