News November 29, 2025

VJA: భవానీ దీక్ష విరమణ.. 3 వేల మందితో బందోబస్తు

image

ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణ నేపథ్యంలో భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ కార్యక్రమాలకు 3 వేల మందికి పైగా పోలీసు సిబ్బందిని నియమించడంతో పాటు, పరిసర ప్రాంతాల పర్యవేక్షణకు 300కు పైగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు.

Similar News

News December 1, 2025

వనపర్తి: రెండోరోజు 399 వార్డు మెంబర్ల నామినేషన్లు దాఖలు

image

వనపర్తి జిల్లాలో రెండో విడతలో జరగనున్న 94 గ్రామ పంచాయతీల్లోని 850 వార్డులకు ఈరోజు మొత్తం 399 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మండలాల వారీగా వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
✓ ఆత్మకూర్ మండలం – 47
✓ అమరచింత మండలం – 52
✓ కొత్తకోట మండలం – 130
✓ మదనాపూర్ మండలం – 43
✓ వనపర్తి మండలం – 127 వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా ఇప్పటివరకు మొత్తం వార్డు సభ్యుల నామినేషన్ల సంఖ్య 454కు చేరింది.

News December 1, 2025

GHMCలో 27 మున్సిపాలిటీల విలీనం.. గవర్నర్ గ్రీన్ సిగ్నల్

image

TG: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC)లో 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనంపై ముందడుగు పడింది. ప్రభుత్వం తీసుకున్న ఆర్డినెన్స్‌కు గవర్నర్ జిష్ణుదేవ్ ఆమోదం తెలిపారు. దీంతో ప్రభుత్వం త్వరలోనే గెజిట్ జారీ చేయనుంది. కాగా <<18393033>>ఈ విస్తరణతో<<>> 2,735 చదరపు కి.మీతో దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ అవతరించనుంది.

News December 1, 2025

GHMCలో 16 ఏళ్ల తర్వాత విగ్రహాల ఆవిష్కరణ

image

GHMC హెడ్ ఆఫీస్‌లో ప్రతిష్ఠించిన Dr. B.R. అంబేడ్కర్, గాంధీ విగ్రహాలను డిసెంబర్ 4, ఆవిష్కరించనున్నారు. అంబేడ్కర్ విగ్రహం కమిషనర్ ప్రవేశ ద్వారం వద్ద, గాంధీ విగ్రహం మేయర్ ప్రవేశ ద్వారం వద్ద దశాబ్దానికి పైగా కప్పి ఉంచబడిన సంగతి తెలిసిందే. నగర పాలక సంస్థ చరిత్ర, స్ఫూర్తిని పెంచే లక్ష్యంతో.. నవీకరించిన ప్రాంగణంలో ఈ విగ్రహాలను ఇప్పుడు ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 11:30 గంటలకు జరుగుతుంది.