News April 18, 2024

ప్రచారం పేరిట కబ్జాలు చేస్తున్నారు: ఆదినారాయణ రెడ్డి

image

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రచారం పేరిట భూకబ్జాలు, సహజవనరులు దోచుకుంటున్నాడని మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. స్థానిక BJP కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. వివేకా హత్యకేసు CM జగన్ దంపతులకు తెలియకుండా జరిగుండదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి అధికారంలోకి వస్తే కడపలో ఉక్కు పరిశ్రమ నిర్మాణం, రాజోలి జలాశయం నిర్వాసితులకు రూ.12.50 లక్షలకు బదులుగా రూ.24 లక్షలు పరిహారం ఇప్పిస్తానని ఆది హామీ ఇచ్చారు.

Similar News

News September 30, 2024

కడప: నేడు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం

image

ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు నేడు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి తెలిపారు. నేటి ఉదయం 9:30 నుంచి 10:30 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. 08562-244437 ల్యాండ్ లైన్ నంబర్‌కు ప్రజలు ఫోన్ చేసి నేరుగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

News September 30, 2024

కడప జిల్లాలో పేలిన డిటోనేటర్.. కారణం?

image

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేముల మండలం వి కొత్తపల్లి గ్రామంలో <<14229836>>డిటోనేటర్ పేలి VRA మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఓ మహిళకు తీవ్ర గాయాలు కాగా ఆమెను కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే మైనింగ్ కోసం ఉంచిన డిటోనేటర్ పేలడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.

News September 30, 2024

కడప జిల్లాలో బాంబు పేలుడు.. VRA మృతి

image

కడప జిల్లా వేముల మండలం కొత్తపల్లిలో బాంబులు కలకలం రేపాయి. స్థానిక VRA వి నరసింహులు ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు బాంబులు వేయడంతో VRA మృతి చెందగా భార్యకు గాయాలయ్యాయినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.