News November 29, 2025
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి: సీపీ విజయ్

స్థానిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అందరూ సహకరించాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ సూచించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నేపథ్యంలో సభలు, ప్రచార వాహనాలు, ర్యాలీలు, సమావేశాల నిర్వహణకు ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News December 1, 2025
అల్లూరి జిల్లాలో ఈనెల 7న ఎన్ఎంఎంఎస్ పరీక్ష

ఈనెల 7న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష జరుగుతుందని DEO బ్రహ్మాజీరావు తెలిపారు. ఈ పరీక్షకు జిల్లా నుంచి 726మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. పాడేరు, చింతపల్లి, రంపచోడవరం, వీఆర్ పురం, చింతూరులో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుందని చెప్పారు. పాఠశాల లాగిన్, మనమిత్ర వాట్సాప్లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు.
News December 1, 2025
HNK: రూ.15 వేలు అకౌంట్లో పడ్డాయా..!

మొంథా తుఫాన్ కారణంగా నష్టపోయిన వరద బాధితులకు ఇంటికి రూ.15 వేల చొప్పున ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి వరంగల్లో ప్రకటించి నెల రోజులు దాటింది. HNK అమరావతినగర్, సమ్మయ్యనగర్, TV టవర్, WGL రామన్నపేట, NTR నగర్ లాంటి ప్రాంతాల్లో వరద ముంపునకు గురైన 6,500 ఇళ్లకు రూ.15 వేల చొప్పున ఇస్తామని ప్రకటించారు. ఇందుకు రూ.12 కోట్లను విడుదల చేశారని చెప్తున్నా, ఇప్పటి వరకు అకౌంట్లో డబ్బులు జమ కాలేదని బాధితులంటున్నారు.
News December 1, 2025
కృష్ణా: పరీక్షల రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల

కృష్ణా యూనివర్సిటీ (KRU) పరిధిలోని కళాశాలల్లో SEP 2025లో నిర్వహించిన BA.LLB 2,6వ సెమిస్టర్ (2025-26 అకడమిక్ ఇయర్) పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు DEC 8లోపు ఒక్కో పేపరుకు రూ. 900 ఫీజు ఆన్లైన్లో http://www.onlinesbi.com/ చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగం సూచించింది.


