News April 18, 2024
MBNR: రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో నేటి నుంచి సందడి

మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థుల పేర్లు ఇప్పటికే ఖరారయ్యాయి. MBNRలో డీకే అరుణ(BJP), వంశీచంద్ రెడ్డి (కాంగ్రెస్), మన్నె శ్రీనివాస్ రెడ్డి (BRS) బరిలో ఉన్నారు. NGKLలో భరత్ ప్రసాద్ (BJP), మల్లు రవి (కాంగ్రెస్), RS ప్రవీణ్ కుమార్ (BRS) పోటీలో ఉన్నారు. నామపత్రాలు సమర్పణకు గెజిట్ నోటిఫికేషన్ నేడు విడుదల కానుండటంతో పాలమూరులో సందడి నెలకొననుంది.
Similar News
News April 23, 2025
బీజేపీ నేత హత్యకు కుట్ర: MBNR ఎంపీ అరుణ

దేవరకద్ర బీజేపీ నేత కొండ ప్రశాంత్ రెడ్డి హత్యకు కుట్రలు జరుగుతున్నాయని ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. ఇవాళ ఆమె ప్రశాంత్ రెడ్డితో కలిసి డీజీపీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గత కొన్ని రోజులుగా ప్రశాంత్ రెడ్డి హత్యకు కుట్రలు జరుగుతున్నాయి అన్నారు. రూ.2కోట్ల 50లక్షలు సుపారి ఇచ్చి హత్యకు కుట్రచేసినట్లు డీకే అరుణ అనుమానం వ్యక్తంచేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఆమె డీజీపీని కోరారు.
News April 23, 2025
MBNR: అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి

వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీటి కొరత రాకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. కలెక్టర్ విజయేంద్రబోయి అధ్యక్షతన జరిగిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు.
News April 22, 2025
ఇంటర్ ఫలితాల్లో వాగ్దేవి ప్రభంజనం

ఆరంభం నుంచి అదే సంచలనం ఏటేటా అదే ప్రభంజనం అది వాగ్దేవికే సొంతం అని కరస్పాండెంట్ విజేత వెంకట్ రెడ్డి తెలిపారు. ఇంటర్ ఫలితాలలో MPC- ఫస్టియర్ అమీనా 468 మార్కులు, BiPC ఫస్టియర్లో సంజన 436 మార్కులతో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారు. సెకండియర్ ఎంపీసీలో నవనీత్ గౌడ్ 992, బైపీసీలో రబ్ ష 991 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు, విద్యార్థులను యాజమాన్యం అభినందించింది.