News November 30, 2025

అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీ చేయాలి: శ్రీకాకుళం ఎస్పీ

image

డిసెంబర్ 13న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో లోక్ అదాలత్ కేసులు తోపాటు బెయిల్స్, రానున్న ఎన్నికల దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. స్వీయ ఒప్పందంతో రాజీకి ప్రోత్సహించాలని తెలిపారు. అదనపు ఎస్పి కెవి రమణ ఉన్నారు.

Similar News

News February 20, 2026

B.Ed సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదల

image

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ B.Ed మొదటి సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఈ మేరకు యూనివర్సిటీ పరీక్షల విభాగం అధికారి డాక్టర్ ఉదయ్ భాస్కర్ విడుదల చేశారు. కాగా ఈ పరీక్షలు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు జరగాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా వేశారు. దీనితో కొత్త తేదీలను ప్రకటించారు. ఈనెల 24 నుంచి మార్చి 2వ తేదీ వరకు మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు జరుగుతాయని తెలిపారు.

News February 20, 2026

శ్రీకాకుళం మీదుగా స్పెషల్ ట్రైన్స్

image

శ్రీకాకుళం జిల్లా రైల్వే ప్రయాణికులకు ఈస్ట్ కోస్ట్ రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. రానున్న హోలీ పండుగ నేపథ్యంలో జిల్లా మీదుగా సాంత్రగచ్చి-యెలహంక-సాంత్రగచ్చి(నం.02863/64) వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ రైలు నడపనున్నట్లు ప్రకటించింది. ఈ రైలు శ్రీకాకుళం రోడ్డు, పలాస స్టేషన్లలో ఆగనుందని రైల్వేశాఖ జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ రైలు మార్చి 5వ తేదీ నుంచి 28వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది.

News February 20, 2026

శ్రీకాకుళంలో మర్చి 13 నుంచి రెవెన్యూ క్రీడలు

image

శ్రీకాకుళంలో వచ్చే నెల 13 నుంచి 15వ తేదీ వరకు రెవెన్యూ క్రీడలు నిర్వహించనున్నట్లు టెక్కలి ఆర్డీవో ఎం. కృష్ణమూర్తి తెలిపారు. గురువారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమై క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణపై సమీక్షించారు. డిప్యూటీ కలెక్టర్ క్యాడర్ స్థాయి అధికారులతో క్రీడలు ప్రారంభమవుతాయని చెప్పారు. మండలాల నుంచి ఎక్కువ మంది పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.