News November 30, 2025

HYD: గ్లోబల్ సమ్మిట్‌కు రాజమార్గం

image

డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగే గ్లోబల్ సమ్మిట్‌కు హాజరయ్యే అంతర్జాతీయ ప్రముఖుల కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎర్పాట్లు చేస్తోంది. రూ.69.23లక్షల అంచనా వ్యయంతో శ్రీశైలం హైవే నుంచి RGIA ఎంట్రీ గేట్ వరకు ఉన్న రోడ్డును ముస్తాబు చేస్తున్నారు. ఇందుకోసం బీటీ రోడ్డుపై బీసీ ఓవర్‌లేయింగ్ పనులు చేపట్టాలని ఎన్‌ఏసీ నిర్ణయించింది. ఈ మార్గంలోనే అతిథులను కందుకూరులోని సమ్మిట్ వేదికకు వెళ్లనున్నారు.

Similar News

News December 3, 2025

ముందుగా ఆర్డినెన్స్.. తర్వాత వీలిన నోటిఫికేషన్

image

గ్రేటర్ HYDలో మున్సిపాలిటీల విలీనానికి సంబంధించి ఆర్డినెన్స్ రావాల్సి ఉంది. వీలీన ప్రక్రియను గవర్నర్ ఇప్పటికే ఆమోదించడంతో త్వరలో ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం విడుదల చేయనుంది. ఆ తర్వాత 3 రోజులకు ఇందుకు సంబంధించి పూర్తి నోటిఫికేషన్ వస్తుంది. ఇందుకోసం అధికారులు పేపర్‌వర్క్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా వార్డుల విభజనకు సంబంధించి ప్రజాభిప్రాయం కూడా సేకరించనున్నారు.

News December 3, 2025

HYD: మౌలమేలనోయి.. అది శిక్షార్షమోయి!

image

నేరం జరిగిందని మీకు తెలుసా? మనకెందుకులే అని ఊరికే ఉన్నారా? అయితే మీరు నేరం చేసినట్లే లెక్క. తప్పు జరిగిందని తెలిసి పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడమూ నేరమే. విచారణలో ఈ విషయం వెల్లడైతే మీపై కేసు నమోదు చేసి కోర్టు ఎదుట హాజరుపరుస్తారు. జూబ్లీహిల్స్‌లో ఓ బాలికపై జరిగిన లైంగిక దాడి ఘటనలో మౌనంగా ఉన్న ఇద్దరు మహిళలను పోలీసులు నిందితులుగా చేర్చారు. BNS సెక్షన్ 211, 33 ప్రకారం అభియోగాలు నమోదు చేస్తారు.

News December 3, 2025

HYD: కుక్క దాడిపై సీఎం తీవ్ర ఆవేదన

image

మూగ బాలుడు <<18449713>>ప్రేమ్ చంద్‌పై<<>>వీధి కుక్కలు దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని, అతడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కుటుంబానికి అవసరమైన తక్షణ సాయాన్ని ప్రభుత్వం పరంగా అందించాని అధికారులను ఢిల్లీనుంచి ఆదేశించారు. GHMC కమిషనర్ స్వయంగా బాలుడిని పరామర్శించి, వారికి అవసరమైన సహాయాన్ని అందించాలని ఆదేశించారు.