News November 30, 2025

NLG: ఉప సర్పంచ్ పదవికి పెరిగిన క్రేజ్!

image

జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో ఉప సర్పంచ్ పదవికి క్రేజ్ పెరిగింది. గ్రామాల్లో చక్రం తిప్పే ముఖ్య నాయకులు అంతా ఇప్పుడు ఉప సర్పంచి పదవి పైనే దృష్టి కేంద్రీకరించారు. రిజర్వేషన్లు అనుకూలంగా రాకపోవడంతో పాటు మహిళలకు 50% సర్పంచి స్థానాలు రిజర్వు కావడంతో చాలా మంది బడా బాబులకు పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో చాలా గ్రామాల్లో ముఖ్య నేతలంతా ఉప సర్పంచి పదవి కోసం రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది.

Similar News

News December 2, 2025

మళ్లీ వేలంలోకి ‘HR88B8888’.. ఎందుకంటే?

image

హరియాణాలో ‘HR88B8888’ అనే వాహన రిజిస్ట్రేషన్ నంబర్ వేలంలో రూ.1.17 కోట్లు పలికి దేశవ్యాప్త చర్చకు దారితీసిన <<18396670>>విషయం<<>> తెలిసిందే. ఈ నంబర్‌ను తిరిగి వేలం వేయనున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. 50,000 కనీస ధరతో ప్రారంభమైన గత ఆన్‌లైన్ వేలంలో 45 మంది బిడ్డర్లు పోటీ పడ్డారు. అయితే ఈ నంబర్‌ను సొంతం చేసుకున్న వ్యక్తి నిర్ణీత గడువులో డబ్బు చెల్లించలేదు. దీంతో మళ్లీ వేలంపాట నిర్వహిస్తున్నారు.

News December 2, 2025

తిరుపతిలో విషాదం.. ఓ ఇంట్లో మూడు మృతదేహాలు

image

తిరుపతి సమీపంలోని దామినేడులో విషాదం నెలకొంది. ఓ ఇంట్లో కుళ్లిన మూడు మృతదేహాలు కలకలం రేపాయి. ఇవి తమిళనాడు రాష్ట్రం, గుడియాత్తంకు చెందిన సత్యరాజ్, పొన్నాగుట్టె నాయగి, మనీశ్ మృతదేహాలుగా పోలీసులు గుర్తించారు. స్థానికులకు దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించగా.. మృతదేహాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News December 2, 2025

పాపవినాశనం డ్యాంపై శాస్త్రవేత్తల పరిశీలన

image

తిరుమలలోని పాపవినాశనం డ్యాంను ముగ్గురు శాస్త్రవేత్తలు సోమవారం పరిశీలించారు. డ్యాం సేఫ్టీ ఎవల్యూషన్లో భాగంగా జలవనరుల శాఖ, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తికి చెందిన శాస్త్రవేత్తలు ఇందులో పాల్గొన్నారు. నీటి నిల్వతో పాటు పలు జాగ్రత్తలపై రిమోట్ ఆపరేటింగ్ వెహికల్‌తో పరిశీలించారు.