News April 18, 2024
తమిళనాడు ఎన్నికల్లో ప్రభావం చూపే అంశాలు..

➥నీట్ పరీక్ష తమకొద్దని, వైద్య సీట్ల భర్తీని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికే వదిలేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ నడుస్తోంది.
➥కచ్చతవు ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించి TNకి ద్రోహం చేశారని కాంగ్రెస్, DMKపై BJP విమర్శలు గుప్పిస్తోంది.
➥రాష్ట్రానికి నిధులివ్వడం లేదని కేంద్రంపై ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు.
➥కావేరి జలాలు, మద్దతు ధర, రుణమాఫీపై BJP, DMKపై రైతులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారనేది విశ్లేషకుల మాట.
Similar News
News February 7, 2026
గుంటూరు: అంబటిపై 36 కేసులు..?

ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 36 కేసులు నమోదైనట్లు సమాచారం. గుంటూరు, బాపట్ల, తూర్పు–పడమర గోదావరి, కర్నూలు, కడప, అనంతపురం, నెల్లూరు, చిత్తూరు తదితర జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. ఎక్కువ కేసుల్లో ఎఫ్ఐఆర్లు నమోదై ఉన్నాయి. కాగా నల్లపాడు కేసులో ఆయనను అరెస్ట్ చేయగా కోర్టు రిమాండ్ విధించింది. ఆయన రాజమండ్రి జైల్లో ఉన్నారు.
News February 7, 2026
పోలీసులు మంచివాళ్లు కాబట్టి పద్ధతిగా కేసీఆర్ ఇంటికే వెళ్లారు: CM

TG: ఫోన్ ట్యాపింగ్ చేస్తే నోటీసు ఇవ్వకపోతే ఏం చేస్తారని సీఎం రేవంత్ అన్నారు. ‘తెలంగాణ జాతిపితకు నోటీసులు ఇచ్చామని కొందరు అంటున్నారు. తప్పు చేస్తే బేడీలు వేసి లాక్కొచ్చే అవకాశం ఉంది. తెలంగాణ పోలీసులు మంచివాళ్లు కాబట్టి పద్ధతిగా కేసీఆర్ ఇంటికే వెళ్లి వాంగ్మూలం తీసుకున్నారు’ అని పరిగి బహిరంగ సభలో తెలిపారు.
News February 7, 2026
రేవంత్ ఎప్పటికీ కాంగ్రెస్ మనిషి కాలేరు: KTR

TG: రేవంత్ ఎప్పటికైనా BJP మనిషేనని KTR ఎద్దేవా చేశారు. కామారెడ్డి(D) బాన్సువాడలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రేవంత్ కాంగ్రెస్ నేత కాదు బడే భాయ్ తమ్ముడు. కాంగ్రెస్ నుంచి ప్రయోజనాలు పొందిన వాళ్లే వారికి ఓటేయాలి. తర్వాత మా ప్రభుత్వం వస్తుంది. కచ్చితంగా కాంగ్రెస్ కంటే గొప్పగా అభివృద్ధి చేస్తాం. ఆయన విసిరే ఎంగిలి మెతుకుల కోసం పోచారం కాంగ్రెస్ సంకలో దూరారు’ అని విమర్శించారు.


