News November 30, 2025

తిరుపతి రుయాలో రూ.50వేల ఇంజెక్షన్ ఫ్రీ

image

బ్రెయిన్ స్ట్రోక్ అత్యంత ప్రమాదకరం. చికిత్సకు రూ.లక్షలు ఖర్చు చేయాలి. తిరుపతి రుయాలో ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. మంగళ, శుక్రవారం న్యూరాలజీ OP ఇస్తారు. అత్యవసర వైద్యం 24గంటలు అందిస్తారు. చేయి, కాలు, మాట పడిపోవడం, మూతి వంకర పోవడం, కళ్లు కనిపించకపోవడం బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు. సకాలంలో గుర్తించి ఇక్కడికి తీసుకొస్తే రూ.50వేల విలువైన ఇంజెక్షన్ వేస్తారు. 90శాతం ప్రాణాపాయం తప్పుతుంది.
SHARE IT.

Similar News

News March 26, 2026

మార్కాపురం: చికిత్స పొందుతున్న వారి వివరాలివే.. 1/2

image

మార్కాపురం బస్సు ప్రమాదంలో చికిత్స పొందుతున్న వారి వివరాలను అధికారులు వెల్లడించారు. 1.అబ్రహం, 2.ప్రవీణ్ (వెలిగండ్ల), 3.లక్ష్మీ కుమారి, 4.మహేంద్రారెడ్డి, 5.తిరుపాలు, 6.మనోహర్, 7.యువరాజ్, 8.మౌనిక,9. శ్రీహరి (కనిగిరి), 10.గురవయ్య (చింతకుంట్ల, నెల్లూరు జిల్లా), 11.జేమ్స్, 12.చిట్టిబాబు (పీసీపల్లి), 13.యోహాను (భూపాలపురం), 14.మనోహర్ (పామూరు), 15.సౌజన్య (కొనకనమిట్ల), 16.బాలరాజు (HMపాడు) <<19486702>>continue<<>>

News March 26, 2026

గంగవరం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

గంగవరం మండలం, మేలుమాయి క్రాస్ వద్ద బుధవారం సాయంత్రం రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్న ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వ్యక్తి మృతి చెందాడు. మేలుమాయి క్రాస్‌కు చెందిన దొరస్వామి రోడ్డు క్రాస్ చేస్తుండగా ఇద్దరు విద్యార్థులు మరో బైక్‌పై వస్తూ ఢీకొట్టారు. స్థానికులు హుటాహుటిన పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

News March 26, 2026

గద్వాల జిల్లాలో నేటి ముఖ్యంశాలు..!

image

*గద్వాల: రాములోరి కళ్యాణానికి ఆలయాలు ముస్తాబు
*ఇటిక్యాల: కలెక్టర్ పర్యటన- కార్యాలయాలు తనిఖీ
*ఎస్సీ యాక్షన్ ప్లాన్ కు ఏప్రిల్ 2 వరకు గడువు
*అలంపూర్: జోగులాంబ ఆలయానికి మంచినీటి కూలర్
*రాజోలి: పేదింటి అమ్మాయి పెళ్ళికి రూ.2 లక్షలు సహాయం
*ఇటిక్యాల: పాలకులు మారినా ప్రజా సమస్యలు తీరలేదు
*అయిజ: మిషన్ భగీరథ కనెక్షన్‌కు మోటార్లు అమర్చితే చర్యలు
*ధరూర్: కూలీ డబ్బులు విడుదల చేయాలని ఆందోళన