News November 30, 2025

అమరావతిలో మరో 5 స్టార్ హోటల్.!

image

రాజధాని అమరావతిలో మాలక్ష్మీ గ్రూప్ ఆధ్వర్యంలో ‘డబుల్ ట్రీ బై హిల్టన్’ పేరిట భారీ 5 స్టార్ హోటల్ రాబోతోంది. విజయవాడ బైపాస్ (E3-N6 జంక్షన్) వద్ద దీని నిర్మాణానికి సాయిల్ టెస్టింగ్ (మట్టి పరీక్షలు) మొదలైంది. 25 అంతస్తుల భవనం, 200 లగ్జరీ గదులు. ఏకంగా 10,500 మంది సామర్థ్యంతో భారీ కన్వెన్షన్ సెంటర్. డిసెంబర్ 2027 నాటికి నిర్మాణం పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు.

Similar News

News March 22, 2026

అల్లు అర్జున్-అట్లీ మూవీలో అనుష్క శర్మ?

image

అల్లు అర్జున్, అట్లీ కాంబోలో వస్తున్న మూవీ కాస్టింగ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ మూవీలో ఇప్పటికే దీపికా పదుకొణె, రష్మిక, మృణాల్, జాన్వీ కపూర్ వంటి స్టార్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా అనుష్క శర్మ పేరు తెరపైకి వచ్చింది. ఏళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్న ఆమె ఈ సినిమాతో పవర్‌ఫుల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్. ఈ మూవీ టీజర్ ఏప్రిల్ 8న బన్నీ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ కానున్నట్లు సమాచారం.

News March 22, 2026

జగన్ హయాంలో ఏపీకి ఆర్థిక నష్టం: రామ్మోహన్ నాయుడు

image

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఏపీకి తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లిందని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన తీవ్ర నష్టాన్ని కూటమి ప్రభుత్వం సరిచేస్తుందని చెప్పుకొచ్చారు. సైకో జగన్‌ను రాష్ట్రం నుంచి తరిమికొట్టిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. శనివారం అరసవిల్లిలో ఓ కార్యక్రమంలో రామ్మోహన్నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు.

News March 22, 2026

VZM: రాములోరి కళ్యాణానికి భక్తులకు ఆహ్వానం

image

మార్చి 27న శ్రీరామనవమి సందర్భంగా రామతీర్ధం శ్రీ సీతారామస్వామి ఆలయంలో జరిగే సీతారాముల కళ్యాణోత్సవానికి ఉత్తరాంధ్ర భక్తులు తరలిరావాలని ఆలయ ఈవో వై.శ్రీనివాసరావు శనివారం కోరారు. కళ్యాణంలో పాల్గొనాలనుకునే దంపతులు రూ.1500 టికెట్ కొనుగోలు చేయాలని తెలిపారు. ఆన్‌లైన్‌లోనూ ఆలయం వద్ద టికెట్లు లభ్యమవుతాయని, పాల్గొనే వారికి శేషవస్త్రాలు, తలంబ్రాలు, ప్రసాదం అందిస్తామన్నారు.