News November 30, 2025
ADB: యోగా ఫలితాలు ఎప్పుడు సారూ..!

KU అనుబంధం ఉన్న SDLCEలో పరీక్షలు పెట్టడం, ఫలితాలు మరిచిపోవడం ఈ మధ్య ఎక్కువైంది. గతేడాది తీసుకొచ్చిన కొత్త కోర్సు డిప్లొమా ఇన్ యోగా పరీక్షలను ఆగస్టు 12 నుంచి 18 వరకు నిర్వహించారు. పరీక్షలు జరిగి 4 నెలలవుతున్నా ఫలితాలు ప్రకటించకపోవడంతో, ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నామని అభ్యర్థులు వాపోతున్నారు. యోగా డిప్లొమా ఉంటే యోగా టీచర్ ఉద్యోగాలు వస్తాయని, ఈ ఫలితాలు ప్రకటించకపోవడం మూలంగా నష్టపోతున్నామంటున్నారు.
Similar News
News March 27, 2026
ఈ క్వాలిటీస్ ఉన్న మహిళలను పురుషులు ఇష్టపడతారు!

మహిళల్లోని కొన్ని క్వాలిటీలు పురుషులను ఆకర్షిస్తాయని నిపుణులు అంటున్నారు. ‘ప్రతి విషయాన్ని సీరియస్గా తీసుకోకుండా మనస్ఫూర్తిగా నవ్వగలిగే వారిని ఇష్టపడతారు. ఇండిపెండెంట్గా, దయతో ఉండే వారు నచ్చుతారు. మనసులో ఉన్నది ఉన్నట్లు చెప్పగల, తమ తప్పును ఒప్పుకోగల వారికి అట్రాక్ట్ అవుతారు. తమకంటూ ఒక లక్ష్యం పెట్టుకొని, తాము కలగన్న వాటిని సాధించుకోవాలనుకునే వారిని పురుషులు లైక్ చేస్తారు’ అని చెబుతున్నారు.
News March 27, 2026
కడప: ఆశ వర్కర్ల నియామకంలో గోల్మాల్?

కడప జిల్లాలో ఇటీవల జరిగిన ఆశా వర్కర్ల నియామకంలో పూర్తిస్థాయిలో అవినీతి జరిగిందంటూ పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అర్హత కలిగిన మహిళలకు కాకుండా అనర్హత కలిగిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటూ ఆధారాలతో ఫిర్యాదు చేసిన సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని బహిరంగ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎటువంటి వెరిఫికేషన్ చేయకుండా ఎవరైతే డబ్బులు ఇచ్చారో వారిని మాత్రమే నియమించారని ఆరోపణలు ఉన్నాయి.
News March 27, 2026
కాసేపట్లో మోదీ మీటింగ్.. ఏం జరగనుంది?

PM మోదీ సా.6.30 గంటలకు అన్ని రాష్ట్రాల సీఎంలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. పశ్చిమాసియా యుద్ధం దేశంపై చూపుతున్న ప్రభావంపై టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. రాష్ట్రాలకు పెట్రోల్, డీజిల్, గ్యాస్ సప్లై సన్నద్ధతపై చర్చిస్తారని తెలుస్తోంది. ఇవే కాకుండా మోదీ వేరే అంశాలపై ఏమైనా కీలక ఆదేశాలు/ప్రకటన ఇస్తారా? అనే చర్చ కూడా నడుస్తోంది. అయితే దేశంలో <<19488586>>లాక్డౌన్<<>> ప్రచారాన్ని కేంద్రం ఇప్పటికే ఖండించింది.


