News November 30, 2025

అది అభివృద్ధి కాదు.. భూ దోపిడీ: బొత్స

image

విశాఖ భూముల దోపిడీకి అడ్డాగా మారిందని MLC బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. రైతులకు గిట్టుబాటు ధర లేక నష్టాల్లో ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ‘లులూ ఒక పనికిమాలిన సంస్థ. రూ.కోట్లు విలువైన భూములను 99 పైసలకే రియల్ ఎస్టేట్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోంది. విశాఖలో భూములు వేలం పెట్టి ఇవ్వాలి’ అని అన్నారు. కేజీహెచ్, భోగాపురం అంశాల్లో కూడా ప్రభుత్వం వైఖరిని ఆయన తప్పుబట్టారు.

Similar News

News March 15, 2026

నెల్లూరు: 7th క్లాస్ బాలిక..9th క్లాస్ బాలుడికి పెళ్లి

image

గుడ్లూరు మండలంలో బాల్య వివాహం జరిగింది. 7వ తరగతి చదువుతున్న బాలికకు, 9వ తరగతి చదువుతున్న బాలుడికి వాళ్ల పెద్దలు శుక్రవారం వివాహం జరిపించినట్లు సమాచారం ఒంగోలులోని స్వచ్ఛంద సంస్థకు తెలిసింది. చట్ట విరుద్ధమైన ఈ బాల్య వివాహాన్ని అడ్డుకోవాలని సంస్థ ప్రతినిధి కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీని కోరారు. ఆయన వెంటనే జోక్యం చేసుకొని బాలికను బాలికా సదన్‌కు తరలించాలని ఆదేశించారు.

News March 15, 2026

వరంగల్ జిల్లాలో నిబంధనలు బేఖాతరు !

image

వరంగల్ జిల్లాలో కొన్ని మెడికల్ షాపులు నిబంధనలకు విరుద్ధంగా మత్తు మందులను విక్రయిస్తున్నాయి. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండానే అమ్మి సోమ్ము చేసుకుంటున్నాయి. ఇటీవల హన్మకొండలో మత్తులో ఉన్న యువకులను నార్కోటిక్ పోలీసులు పట్టుకోవడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గతంలో కాజీపేటలో ఇలాంటి ఘటనే జరగ్గా, తాజాగా వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ సమీపంలోని ఓ షాపును అధికారులు సీజ్ చేశారు.

News March 15, 2026

వరంగల్ జిల్లాలో నిబంధనలు బేఖాతరు !

image

వరంగల్ జిల్లాలో కొన్ని మెడికల్ షాపులు నిబంధనలకు విరుద్ధంగా మత్తు మందులను విక్రయిస్తున్నాయి. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండానే అమ్మి సోమ్ము చేసుకుంటున్నాయి. ఇటీవల హన్మకొండలో మత్తులో ఉన్న యువకులను నార్కోటిక్ పోలీసులు పట్టుకోవడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గతంలో కాజీపేటలో ఇలాంటి ఘటనే జరగ్గా, తాజాగా వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ సమీపంలోని ఓ షాపును అధికారులు సీజ్ చేశారు.