News November 30, 2025

అది అభివృద్ధి కాదు.. భూ దోపిడీ: బొత్స

image

విశాఖ భూముల దోపిడీకి అడ్డాగా మారిందని MLC బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. రైతులకు గిట్టుబాటు ధర లేక నష్టాల్లో ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ‘లులూ ఒక పనికిమాలిన సంస్థ. రూ.కోట్లు విలువైన భూములను 99 పైసలకే రియల్ ఎస్టేట్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోంది. విశాఖలో భూములు వేలం పెట్టి ఇవ్వాలి’ అని అన్నారు. కేజీహెచ్, భోగాపురం అంశాల్లో కూడా ప్రభుత్వం వైఖరిని ఆయన తప్పుబట్టారు.

Similar News

News March 21, 2026

MBNR: డిగ్రీ పరీక్ష ఫీజుకు వారం గడువు

image

పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ (BSC, BZC, BA) 2, 4, 6 సెమిస్టర్ల రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్ష ఫీజు చెల్లింపునకు ఈ నెల 28తో గడువు ముగియనుంది. విద్యార్థులు సకాలంలో కాలేజీ వెబ్‌సైట్లలో ఫీజు చెల్లించి పత్రాలు సమర్పించాలని అధికారులు సూచించారు. రూ.300 అపరాధ రుసుముతో ఈ నెల 30 వరకు అవకాశం ఉంది.

News March 21, 2026

BREAKING: మార్కాపురం జిల్లాలో MRO సస్పెండ్

image

మార్కాపురం జిల్లా పెద్దారవీడు MRO దిలీప్ కుమార్, దేవరాజుగట్టు VOR విజయభాస్కర్‌ రెడ్డిలను సస్పెండ్ చేసినట్లు మార్కాపురం జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ రాజబాబు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. భూముల వ్యవహారంలో తహశీల్దార్ దిలీప్ కుమార్ అక్రమాలకు పాల్పడ్డారని, 25కి పైగా మ్యుటేషన్‌లు నిబంధనలకు విరుద్ధంగా ఆన్‌లైన్ చేశారని వివరించారు. భూ అక్రమాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News March 21, 2026

మోదీనే అతిపెద్ద చొరబాటుదారుడు: సీఎం మమత

image

బెంగాల్ ఎన్నికల్లో అక్రమ వలసల అంశం బీజేపీకి ప్రచారాస్త్రంగా మారిన వేళ ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ దీనిపై కౌంటర్ ఇచ్చారు. బెంగాల్‌ను టార్గెట్ చేసేవారు నరకానికి వెళ్తారని.. ప్రధాని మోదీ, ఆయన ప్రభుత్వమే అతిపెద్ద చొరబాటుదారులని విమర్శించారు. కోల్‌కతాలోని ఈద్ ఈవెంట్‌‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ఇప్పటికే SIRపైనా మమత విమర్శలు గుప్పించారు. BJP ప్రజల హక్కులను లాక్కోవాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు.