News November 30, 2025

కన్నెస్వాములు శబరి యాత్రలో పాటించే ఈ ఆచారం గురించి మీకు తెలుసా?

image

తొలిసారి మాల ధరించినవారిని కన్నె స్వాములు అని అంటారు. వీరు తమ మొదటి యాత్రకు గుర్తుగా శరములను (అంబులను) ఎరుమేలి నుంచి తెచ్చి శరంగుత్తి అనే ప్రదేశంలో గుచ్చుతారు. ఈ శరాలు గుచ్చిన చోటే రక్షణగా వచ్చిన కరుప్పస్వామి ఆగిపోతారని నమ్మకం. మాలికపురత్తమ్మ అమ్మవారు ప్రతి సంవత్సరం ఏనుగు అంబారిపై వచ్చి, ఆ శరాలను చూసి, తన వివాహం జరగలేదని బాధపడి వెనుతిరిగి వెళుతుందని ప్రతీతి. <<-se>>#AyyappaMala<<>>

Similar News

News March 13, 2026

పెరిగిన విమాన టికెట్ల ధరలు!

image

ఆయిల్ ధరలు పెరగడంతో టికెట్లపై ఇంధన సర్‌ఛార్జ్‌లు విధించాలని ఎయిర్‌లైన్స్ భావిస్తున్నాయి. ఇప్పటికే ఎయిరిండియా వసూలు చేస్తుండగా, తాజాగా ఇండిగో కూడా పెంచింది. రేపటి నుంచి సర్వీసులను బట్టి ₹425-2,300 అదనంగా ఛార్జ్ చేయనున్నట్లు తెలిపింది. మరోవైపు స్పైస్ జెట్, ఆకాశ ఎయిర్ కూడా అదే దారిలో వెళ్తాయని తెలుస్తోంది. ఈమేరకు అంతర్గత చర్చలు జరుపుతున్నాయని, త్వరలో ధరలు ఖరారు చేస్తాయని సమాచారం.

News March 13, 2026

USతో ట్రేడ్ డీల్‌ నిలిపివేత వార్తలు.. భారత్ స్పందన!

image

అమెరికాపై అధిక టారిఫ్‌లు వేస్తున్నాయంటూ భారత్, చైనా సహా 16 దేశాలపై <<19359537>>దర్యాప్తునకు<<>> ట్రంప్ ఆదేశించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో USతో ట్రేడ్ డీల్‌ను ఇండియా నిలిపేయనుందని Reuters తెలిపింది. ఒప్పందంపై సంతకం చేయకుండా కొన్ని నెలలు ఆలస్యం చేయనుందని పేర్కొంది. అయితే ఈ వార్తల్లో నిజం లేదని, పరస్పర ప్రయోజనకర ఒప్పందం కోసం రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయని కేంద్ర వాణిజ్య శాఖ తెలిపింది.

News March 13, 2026

7-8 గంటలు నిద్రపోయినా నీరసంగా ఉందా?

image

7-8 గంటలు పడుకున్నా ఉదయాన్నే నీరసంగా, తల భారంగా అనిపిస్తే అది కేవలం నిద్ర సమస్య కాకపోవచ్చునని డాక్టర్లు చెబుతున్నారు. విటమిన్ B12, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ D లోపం వల్ల ఎనర్జీ తగ్గి, కండరాల రికవరీ దెబ్బతింటుంది. దీంతో నిరంతరం అలసట, మూడ్ స్వింగ్స్, మెదడు మొద్దుబారడం వంటి సమస్యలొస్తాయి. సరైన ఆహారం, సూర్యరశ్మి, తగినంత నీరు తీసుకోవడంతో పాటు టెస్ట్‌లు చేయించుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.