News November 30, 2025

మెగా పీటీఎం పక్కాగా నిర్వహించాలి: అనకాపల్లి డీఐఈవో

image

డిసెంబర్ 5న జిల్లాలోని అన్ని జూనియర్ కళాశాలల్లో తల్లిదండ్రుల సమావేశాలు పక్కాగా నిర్వహించాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి మద్దిలి వినోద్ బాబు స్పష్టంచేశారు. సమావేశంలో యూనిట్ టెస్టులు, క్వార్టర్లీ, అర్థ సంవత్సర పరీక్షల్లో విద్యార్థుల ప్రగతి తల్లిదండ్రులకు తెలియజేయాలన్నారు. హోలిస్టిక్ ప్రోగెస్ కార్డులు ఇవ్వాలన్నారు. సమావేశం ఫొటోలు, వీడియోలు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు.

Similar News

News March 14, 2026

తిరుమలలో మూడు ఆస్థానాలు

image

తిరుమలలో ఈ నెలలో మూడు ఆస్థానాలు జరగనున్నాయి. ఈనెల 19న ఉదయం 7గంటలకు ఉగాది ఆస్థానం నిర్వహిస్తారు. మూలవిరాట్, ఉత్సవమూర్తులకు కొత్త వస్త్రాలు సమర్పించి వేదపండితులు పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. 27న రాత్రి 9గంటలకు శ్రీరామనవమి ఆస్థానం జరుగుతుంది. సాయంత్రం 6.30 నుంచి 8 గంటల వరకు హనుమంత వాహన సేవ నిర్వహిస్తారు. తర్వాతి రోజు రాత్రి 8 గంటలకు పట్టాభిషేక ఆస్థానం జరుగుతుంది.

News March 14, 2026

ఆయన చొరవతో కేయూలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు!

image

కేయూ మాజీ ఉప కులపతి <<19381852>>ఆచార్య లింగమూర్తి<<>> పేద విద్యార్థులకు ఉన్నత సాంకేతిక విద్య అందించాలనే లక్ష్యంతో పరితపించేవారు. కేయూలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అనతి కాలంలోనే ఇంజినీరింగ్ కళాశాలతో పాటు, 40 శాశ్వత ఉద్యోగాలు మంజూరయ్యాయి. ప్రస్తుతం 6 బీటెక్ కోర్సుల్లో 360 మంది విద్యార్థులు ఇంజినీరింగ్ చేస్తున్నారు.

News March 14, 2026

కేయూ మాజీ వైస్ ఛాన్స్‌లర్ లింగమూర్తి మృతి

image

కాకతీయ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్స్‌లర్ లింగమూర్తి ఈరోజు మధ్యాహ్నం 12:20 గం.కు మృతి చెందారు. ఆయనకు భార్య అంజలి, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. గత ఆరు మాసాలుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండు నెలలుగా హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆరోగ్యం క్షీణించడంతో వారం రోజుల క్రితం ఆయన నివాసానికి తీసుకురాగా ఈరోజు తుది శ్వాస విడిచారు.