News November 30, 2025
1100 సేవలను సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

ప్రకాశం జిల్లా ప్రజలు మీకోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ రాజాబాబు కోరారు. గ్రీవెన్స్ డేలో అర్జీలు అందించినప్పటికీ పరిష్కారం కాకపోయినా, తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకు 1100ను సంప్రదించాలని సూచించారు. తుఫాన్ నేపథ్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో PGRS రద్దయిన విషయం తెలిసిందే.
Similar News
News March 10, 2026
మిస్సింగ్ కేసుల చేదనకు ప్రత్యేక దృష్టి సారించాలి: ప్రకాశం SP

మిస్సింగ్ కేసులు, NBW, మహిళలకు సంబంధించిన కేసులు, రోడ్డు ప్రమాదాల నివారణ, అలాగే స్వర్ణాంధ్ర విజన్కి పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ వంటి అంశాలపై సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై అధికారులను అరా తీశారు. మిస్సింగ్ కేసుల చేధనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, చిన్నారులు, మహిళల అదృశ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
News March 10, 2026
మిస్సింగ్ కేసుల చేదనకు ప్రత్యేక దృష్టి సారించాలి: ప్రకాశం SP

మిస్సింగ్ కేసులు, NBW, మహిళలకు సంబంధించిన కేసులు, రోడ్డు ప్రమాదాల నివారణ, అలాగే స్వర్ణాంధ్ర విజన్కి పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ వంటి అంశాలపై సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై అధికారులను అరా తీశారు. మిస్సింగ్ కేసుల చేధనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, చిన్నారులు, మహిళల అదృశ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
News March 9, 2026
ప్రకాశం: ఈతకు వెళ్లి ఇంజినీరింగ్ విద్యార్థి మృతి

ప్రకాశం జిల్లాకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డ ఘటన నరసరావుపేటలో జరిగింది. నరసరావుపేట (M) పెట్లూరువారిపాలెంలో స్థానిక ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న కొనకనమిట్ల (M) కాట్రగుంటకి చెందిన మల్లెల అజయ్(19) ఆదివారం NSP కాలువలో ఈతకు వెళ్లాడు. నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయాడు. కళాశాల వార్డెన్ ఫిర్యాదుతో నరసరావుపేట SI కిషోర్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.


