News November 30, 2025
రేపు ప్రజావాణి కార్యక్రమం రద్దు: ములుగు కలెక్టర్

ములుగు జిల్లాలో సోమవారం జరగనున్న ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ దివాకర్ టీఎస్ తెలిపారు. జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయడం జరుగుతుందన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరగదని ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.
Similar News
News March 21, 2026
‘యుద్ధాన్ని మేము ప్రారంభించలేదు’.. మోదీతో ఇరాన్ అధ్యక్షుడు

యుద్ధాన్ని తాము ప్రారంభించలేదని ప్రధాని మోదీతో ఫోన్ కాల్ సందర్భంగా ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ స్పష్టం చేశారు. అణుశక్తిపై చర్చలు జరుగుతుండగానే US, ఇజ్రాయెల్ అన్యాయంగా దాడి చేశాయన్నారు. ఇరాన్ అణుకార్యకలాపాలను ఆపేందుకే ఈ దాడులు చేస్తున్నామన్న US వాదనను ఖండించారు. మాజీ సుప్రీంలీడర్ అలీ ఖమేనీ అణ్వాయుధాలను తీవ్రంగా వ్యతిరేకించారని తెలిపారు. యుద్ధం ఆగాలంటే ప్రత్యర్థులు వెంటనే దాడులు ఆపాలన్నారు.
News March 21, 2026
వాహనదారులకు రిలీఫ్.. ఎల్లుండి నుంచి..

TG: ఒకే పేరుపై రెండో వాహనం కొంటే అదనంగా కట్టాల్సిన 2% లైఫ్ ట్యాక్స్ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నెల 23 నుంచి ఇది అమల్లోకి రానుంది. దీంతో వాహనదారులకు ఊరట లభించనుంది. ఇక అదే రోజున రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ‘వాహన్’ పోర్టల్ను మంత్రి పొన్నం ప్రభాకర్ లాంచ్ చేయనున్నారు. రాష్ట్ర వాహనాల డేటా ఆ పోర్టల్తో అనుసంధానం కానుంది. దీంతో అంతర్రాష్ట్ర వాహనాల కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్ ఈజీ అవుతుంది.
News March 21, 2026
కాకినాడలో 140 మెట్రిక్ టన్నుల బియ్యం సీజ్

విదేశాలకు అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని డీఎస్ఓ సత్యనారాయణ రాజు దాడి చేసి పట్టుకున్నారు. కాకినాడ పోర్టులో ఐదు లారీల్లో 140 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేస్తుండగా డీఎస్ఓ శనివారం అడ్డుకున్నారు. మొత్తం 140 టన్నుల బియ్యం ఖరీదు రూ.65 లక్షలు ఉంటుందని ఆయన చెప్పారు. ధాన్యాన్ని, ఎక్స్పోర్టు చేస్తున్న లారీలను సీజ్ చేశామన్నారు. పీడీఎస్ రైస్ను క్రయవిక్రయాలు జరిపితే కేసులు తప్పవని హెచ్చరించారు.


