News November 30, 2025
జగన్ హయాంలో ఇరిగేషన్ నాశనం: మంత్రి నిమ్మల

AP: YS జగన్ హయాంలో రాష్ట్ర ఇరిగేషన్ వ్యవస్థ పూర్తిగా నాశనం అయిందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన మంత్రి.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చాక శ్రీశైలం ప్లంజ్ పూల్, తుంగభద్ర గేట్లు, ధవళేశ్వరం బ్యారేజ్ కోసం మొత్తంగా రూ.400 కోట్లకు పైగా కేటాయించినట్లు తెలిపారు. మత్స్యకారులకు ఎన్నికల హామీ మేరకు భృతి రూ.20 వేలకి పెంచినట్లు చెప్పారు.
Similar News
News March 5, 2026
జగన్ క్రిస్టియనా, కాదా? అచ్చెన్న వ్యాఖ్యలతో సభలో దుమారం

AP: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం ఇవాళ కూడా శాసనమండలిని కుదిపేస్తోంది. జగన్ క్రిస్టియనా కాదా? అంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. నిన్న కూడా సభలో తాను ప్రశ్నించానని, 24 గంటలు గడిచినా జగన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అచ్చెన్న కామెంట్స్ను వ్యతిరేకిస్తూ YCP సభ్యులు నినాదాలతో ఆందోళనకు దిగారు. ఈ గందరగోళంతో ఛైర్మన్ మోషేన్ రాజు సభను 5 నిమిషాలు వాయిదా వేశారు.
News March 5, 2026
ఇంటర్ తర్వాత ఏయే కోర్సులున్నాయంటే?

ఇంటర్లో MPC, BiPC, CEC, HEC, MEC చదివినవారు తర్వాత ఏం చేస్తే ఉత్తమ భవిష్యత్తు ఉంటుందో తెలుసుకుందాం. MPC చదివినవారు ఇంజినీరింగ్ వైపు వెళ్లాలనుకుంటే EAPCET రాసి బీటెక్ (B.Tech)లో చేరవచ్చు. ప్రస్తుతం ఐటీ రంగంలో డిమాండ్ ఉన్న కంప్యూటర్ సైన్స్ (CSE), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రానిక్స్ (ECE) వంటి కోర్సులు తీసుకోవచ్చు. సివిల్, మెకానికల్ విభాగాల్లోనూ మంచి అవకాశాలున్నాయి. రేపు 2PMకు BiPC గురించి..
News March 5, 2026
డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

న్యూఢిల్లీలోని డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీలో 10 సైంటిస్ట్ C పోస్టులకు అప్లై చేయడానికి మార్చి 14 ఆఖరు తేదీ. PhD(లైఫ్ సైన్స్/ బయో టెక్నాలజీ/ బయో కెమిస్ట్రీ/ఫార్మాస్యూటికల్/అగ్రికల్చరల్/ వెటర్నరీ సైన్సెస్), MD అర్హత గల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.67,700-రూ.2,08700 చెల్లిస్తారు. వెబ్సైట్: www.dbtindia.gov.in


