News November 30, 2025
ఏటూరునాగారంలో సర్పంచ్ బరిలో ఇద్దరు ‘శ్రీలత’లే

ఏటూరునాగారంలో సర్పంచ్గా పోటీ చేసే ఇద్దరు మహిళా అభ్యర్థుల పేర్లు శ్రీలత కావడం గమనార్హం. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్ నుంచి కాకులమర్రి శ్రీలత పోటీలో ఉండగా, కాంగ్రెస్ నుంచి గుడ్ల శ్రీలత బరిలో ఉన్నారు. అయితే, ఇద్దరి పేరు ఒకేలా ఉండటంతో కొంతమంది నిరక్షరాస్యులు, వృద్ధులు తికమక పడుతున్నారు. కాగా, స్థానిక ఎన్నికలకు పార్టీ గుర్తులు సైతం ఉండకపోవడంతో ఎన్నికల కమిషన్ కేటాయించే గుర్తులతో ప్రచారం చేయనున్నారు.
Similar News
News March 29, 2026
IPL: ముంబైపై KKR భారీ స్కోర్

ముంబైలోని వాంఖడే స్టేడియంలో MIతో జరిగిన మ్యాచ్లో రహానే, రఘువంశీ అర్ధశతకాలు బాదడంతో KKR భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 220 పరుగులు సాధించింది. ఓపెనర్లు రహానే(67), అలెన్(37) తొలి వికెట్కు 69 రన్స్ జోడించారు. ఆపై రింకూ సింగ్(33*)తో కలిసి రఘువంశీ(51) స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. గ్రీన్ 18 పరుగులకే ఔట్ అయ్యారు. MI బౌలర్లలో శార్దూల్ 3, హార్దిక్ ఒక వికెట్ తీశారు.
News March 29, 2026
UPDATE: యమపాశమైన టైరు.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు

మణుగూరు ఏరియాలోని దుర్గా కంపెనీలో ఆదివారం జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. డంపర్ టైరు మెయింటెనెన్స్ చేస్తుండగా అది ఒక్కసారిగా పేలడంతో ఐదుగురు బీహార్ కార్మికులు గాయపడ్డారు. వీరిని ఆస్పత్రికి తరలించగా ఒకరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో కొత్తగూడెం తరలించారు. విషయం తెలిసిన సీఐటీయూ నేతలు మంద నరసింహారావు, వెంకటరత్నం ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు.
News March 29, 2026
నెల్లూరు జిల్లాలో విషాదం..

మర్రిపాడు మండలం నందవరంలో విషాదం చోటు చేసుకుంది. పాముకాటుకు గురై గోగుల నవనీత్ (5) అనే బాలుడు మృతి చెందాడు. ఇంటి ఆరు బయట ఆడుకుంటున్న ఆ చిన్నారిని పాము కాటు వేయడంతో గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పంచనామా అనంతరం కుటుంబ సభ్యులకు ఆదివారం అప్పగించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు.


