News November 30, 2025
సింహాచలంలో ఐదు రోజుల పాటు ఆర్జీత సేవలు రద్దు

సింహాచలం వరహాలక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్ర ఉత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. ఆదివారం మొదలుకొని ఐదు రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఈఓ సుజాత తెలిపారు. ఈ మేరకు నవంబర్ 30నుంచి డిసెంబర్ 4వరకు ఆలయంలో ప్రతి రోజు జరిగే ఆర్జీత సేవలు రద్దు చేశారు. దర్శనాలు యథావిధిగా జరుగుతాయన్నారు. భక్తులు గమనించాలన్నారు.
Similar News
News March 7, 2026
‘మీ పని చూసుకోండి’.. ట్రంప్పై కమల్ హాసన్ ఫైర్

రష్యా నుంచి ఆయిల్ కొనేందుకు భారత్కు అనుమతిస్తున్నామన్న అమెరికా ప్రకటనపై మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భారత్ సార్వభౌమ దేశమని.. విదేశాల నుంచి ఆదేశాలు తీసుకోదంటూ ట్రంప్ను ట్యాగ్ చేస్తూ Xలో పోస్ట్ చేశారు. మీ పని మీరు చూసుకోండంటూ ఘాటుగా స్పందించారు. దేశాల మధ్య పరస్పర గౌరవమే ప్రపంచ శాంతికి పునాది అని హితవు పలికారు.
News March 7, 2026
రఘురామ కేసు: సమాధానాలు దాటవేసిన IPS సునీల్?

AP: రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో IPS అధికారి సునీల్ నాయక్ మూడో రోజు విచారణ ముగిసింది. గుంటూరు CCS పోలీస్ స్టేషన్లో అధికారులు 7గంటల పాటు ప్రశ్నించారు. రఘురామను గుంటూరుకు తరలించిన టైమ్లో అక్కడికి రావాల్సిన అవసరం ఏముందని అడిగిన ప్రశ్నలకు సునీల్ నుంచి సరైన సమాధానం రాలేదని సమాచారం. హైకోర్టు ఉత్తర్వుల మేరకు రేపు, ఎల్లుండి కూడా ఈ విచారణ కొనసాగుతుందని దర్యాప్తు అధికారులు వెల్లడించారు.
News March 7, 2026
గోల్డ్ రింగ్, పెళ్లికి 8గ్రా. బంగారం.. సాధ్యమేనా?

TNలో ఎన్నికల వేళ TVK చీఫ్ విజయ్ ప్రకటించిన <<19322449>>హామీల<<>>పై చర్చ జరుగుతోంది. పిల్లలు పుడితే గోల్డ్ రింగ్, అమ్మాయి పెళ్లికి 8గ్రా. బంగారం ఇస్తామని ఇవాళ ప్రకటించారు. మిగతా వాటిని అటుంచితే బంగారం హామీ హాట్ టాపిక్ అయింది. ఇది వినడానికి బాగానే ఉన్నా 10 గ్రాముల బంగారం ధర రూ.లక్షన్నరకు పైగా ఉన్న తరుణంలో అమలు సాధ్యమేనా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. హామీలకు హద్దులుండవా? అని నెట్టింట చర్చ జరుగుతోంది. మీరేమంటారు?


