News November 30, 2025
ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతోంది: నేవీ చీఫ్

ఆపరేషన్ సిందూర్ ఇప్పటికీ కొనసాగుతోందని నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి తెలిపారు. ముందస్తు హెచ్చరికలు లేకుండానే ఘర్షణలు చెలరేగవచ్చని హెచ్చరించారు. 24 గంటలూ సిద్ధంగా ఉండాలని, అన్ని దళాల్లో వైమానిక రక్షణ అవసరమని అన్నారు. పాకిస్థాన్ నేవీ తమ హార్బర్లకే పరిమితం అయ్యేలా చేశామని వెల్లడించారు. సముద్ర మార్గాలను కాపాడుతూ ఇండో పసిఫిక్ అంతటా నేవీ కార్యకలాపాలు కొనసాగిస్తోందని చెప్పారు.
Similar News
News March 13, 2026
IPL: ఆ జట్టులోకి స్టార్ ప్లేయర్

బంగ్లాతో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ముస్తాఫిజుర్ను KKR టీమ్ తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా అతడి ప్లేస్లో జింబాబ్వే పేస్ సంచలనం ముజరబానిని తీసుకున్నట్లు ప్రకటించింది. ఇటీవల T20 WCలో అతడు అద్భుతంగా రాణించారు. 13 వికెట్లు తీసి జింబాబ్వే సూపర్-8కు చేరడంలో కీలకపాత్ర పోషించారు. ఓవరాల్గా 80 T20Iల్లో 90 వికెట్లు పడగొట్టారు. IPL ఆఫర్తో ముజరబాని పాకిస్థాన్ సూపర్ లీగ్ కాంట్రాక్ట్ను వదులుకున్నారు.
News March 13, 2026
విజయ్ ఎన్డీఏలో చేరతారా?

తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న TVK చీఫ్ విజయ్ రేపటి ఢిల్లీ టూర్ ఆసక్తిగా మారింది. కరూర్ తొక్కిసలాట ఘటనపై CBI విచారణకు హాజరవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నా.. NDAతో పొత్తుపై చర్చించేందుకు హస్తినకు వెళ్తున్నట్లు తమిళనాట చర్చ నడుస్తోంది. విజయ్ NDAలో చేరేలా పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నేటి పార్టీ మీటింగ్లోనూ కొందరు TVK నేతలూ కమలదళంతో పొత్తుకే మొగ్గు చూపారట.
News March 13, 2026
PHOTO GALLERY: ‘మూసీ’ డిజైన్లు చూశారా?

TG: రాష్ట్ర ప్రభుత్వం మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న విషయం తెలిసిందే. తొలిదశలో గాంధీ సరోవర్ ప్రాజెక్టును పూర్తి చేయనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ‘మూసీ ఇన్వైట్స్’ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తోంది. తాజాగా ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్లు రిలీజ్ అయ్యాయి. పైన గ్యాలరీలో వాటిని చూడొచ్చు.


