News November 30, 2025

రెండేళ్లలో రూ.71,500 కోట్ల మద్యం తాగేశారు!

image

TG: 2023 నుంచి 2025 నవంబర్ వరకు రాష్ట్రంలో రూ.71,500 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. అందులో 60% విస్కీ, మిగిలినవి బీర్, వోడ్కా, బ్రాందీ మొదలైనవి ఉన్నాయి. కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం 2025 డిసెంబర్ నుంచి 2027 నవంబర్ చివరి వరకు రెండేళ్లలో మద్యం అమ్మకాలు దాదాపు రూ.90,000 కోట్ల వరకు ఉంటాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇటీవల 2,620 వైన్ షాపుల వేలం ద్వారా సర్కారుకు రూ.2,868 కోట్ల ఆదాయం వచ్చింది. 

Similar News

News March 28, 2026

గోల్ఫ్ స్టార్ టైగర్ వుడ్స్ అరెస్ట్

image

గోల్ఫ్ స్టార్ టైగర్ వుడ్స్ ఫ్లోరిడాలో జరిగిన కారు ప్రమాదం తర్వాత ‘డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్’ (DUI) కింద అరెస్ట్ అయ్యారు. ఆయన నడుపుతున్న కారు ఒక ట్రక్కును ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో వుడ్స్ క్షేమంగా బయటపడ్డారు. అయితే ఆయన డ్రింక్ చేయలేదని బ్రీత్ అనలైజర్ టెస్టులో తేలినప్పటికీ మూత్ర పరీక్ష చేయడానికి నిరాకరించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఏదైనా డ్రగ్స్ వాడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

News March 28, 2026

IPL 2026: కోహ్లీ ముందున్న 5 అరుదైన రికార్డులు

image

IPLలో కోహ్లీ పలు రికార్డులపై కన్నేశారు. 339 రన్స్ సాధిస్తే 9,000 IPL పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా నిలుస్తారు. అలాగే ఒకే జట్టు (RCB) తరపున 10,000 T20 రన్స్, 300 సిక్సర్లు బాదిన ఫస్ట్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. భారత్‌లో 10,000 T20 రన్స్ మైల్‌స్టోన్‌కు కేవలం 296 పరుగుల దూరంలో ఉన్నారు. ఒకే వేదికపై (చిన్నస్వామి స్టేడియం) హయ్యెస్ట్ రన్స్ రికార్డును మరింత మెరుగుపరుచుకోనున్నారు.

News March 28, 2026

ట్రంప్-మోదీ ఫోన్ కాల్‌లో ఎలాన్ మస్క్

image

యుద్ధం నేపథ్యంలో ఇటీవల ట్రంప్, మోదీ ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఈ కాల్‌లో మస్క్ పాల్గొనడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. ఇద్దరు దేశాధినేతల మధ్య జరిగే దౌత్యచర్చల్లో ఏ ప్రభుత్వ పదవిలో లేని ఒక ప్రైవేట్ వ్యక్తి పాల్గొనడం చాలా రేర్. ముఖ్యంగా గ్లోబల్ ఎనర్జీకి కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ కంట్రోల్ గురించి చర్చిస్తున్న సమయంలో మస్క్ ఉండటం చర్చనీయాంశమైంది.