News November 30, 2025

జగిత్యాల: 2వ విడత సర్పంచ్‌కు171.. వార్డ్ మెంబర్‌కు 238 నామినేషన్లు

image

జగిత్యాల జిల్లాలో 2వ విడత పంచాయతీ ఎన్నికలకు ఆదివారం సర్పంచ్ స్థానాలకు 171, వార్డు మెంబర్ స్థానాలకు 238 నామినేషన్లు వచ్చినట్లు కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. సర్పంచ్ స్థానాలకు బీర్పూర్ మండలంలో17, జగిత్యాల9, జగిత్యాల రూరల్36, కొడిమ్యాల33, మల్యాల19, రైకల్39, సారంగాపూర్18, వార్డ్ మెంబర్ కు బీర్పూర్30, జగిత్యాల11, జగిత్యాల రూరల్34, కొడిమ్యాల41, మల్యాల48, రైకల్45, సారంగాపూర్ మండలంలో 29 వచ్చాయన్నారు.

Similar News

News December 1, 2025

తుఫాన్ ఎఫెక్ట్.. రూ.700కు చేరిన టమాటా

image

దిత్వా తుఫాను ఎఫెక్ట్ టమాటా ధరలపై పడింది. పుంగనూరు మార్కెట్‌లో సోమవారం 15 కిలోల టమాటా బాక్స్ రూ.700 పలికింది. 66.19 మెట్రిక్ టన్నుల కాయలు వచ్చాయి. రెండో రకం రూ.500, మూడో రకం రూ.350 చొప్పున వ్యాపారులు రైతుల నుంచి కొనుగోలు చేశారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ధరలు పెరిగినట్లు రైతులు తెలిపారు.

News December 1, 2025

ఆత్మకూరులో సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి

image

వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు సోమవారం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆయన రూ.15 కోట్ల చొప్పున ఆత్మకూరు, అమరచింత నగర అభివృద్ధి పనులకు, రూ.22 కోట్లతో 50 పడకల ఆసుపత్రి భవనానికి, రూ.121.92 కోట్లతో జూరాల హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.

News December 1, 2025

మహబూబాబాద్ డీఈఓగా రాజేశ్వర్ బాధ్యతల స్వీకరణ

image

జిల్లా నూతన విద్యాశాఖ అధికారి (డీఈఓ)గా రాజేశ్వర్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో డీఈఓగా పనిచేసిన దక్షిణామూర్తి వీఆర్‌ఎస్‌ తీసుకోవడంతో, విద్యాశాఖ ఏడీగా ఉన్న రాజేశ్వర్‌ను డీఈఓగా నియమించారు. జిల్లా విద్యాశాఖ సిబ్బంది, పలువురు నూతనంగా బాధ్యతలు తీసుకున్న రాజేశ్వర్‌రావుకు అభినందనలు తెలిపారు.