News November 30, 2025
తుఫాను ప్రభావం పడే 14 మండలాలు ఇవే.!

ప్రకాశం జిల్లాలోని 14 మండలాలపై తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని కలెక్టర్ రాజబాబు అన్నారు. కనిగిరి, కొండపి, కొత్తపట్నం, మర్రిపూడి, మద్దిపాడు, నాగులుప్పలపాడు, ఒంగోలు, పామూరు, పీసీపల్లి, పొన్నలూరు, సంతనూతలపాడు, టంగుటూరు, సింగరాయకొండ, జరుగుమల్లి మండలాల్లో తీవ్రమైన గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నందున పరిస్థితిని పరిశీలించి, అవసరమైన చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు.
Similar News
News March 23, 2026
ప్రకాశం: పటిష్ఠ భద్రత మధ్య పదో తరగతి పరీక్షలు

పదో తరగతి పబ్లిక్ పరీక్షల సందర్భంగా ప్రకాశం జిల్లా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఎగ్జాం సెంటర్ల వద్ద భద్రతను పెంచడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణ, నిరంతర నిఘా ఏర్పాటు చేసి విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడానికి చర్యలు చేపట్టారు. 144 సెక్షన్ అమలు చేస్తూ అనవసరంగా గుంపులు గుమిగూడకుండా చూశారు. ఇవాళ మ్యాథ్స్ పేపర్ కష్టంగా వచ్చిందని పలువురు తెలిపారు.
News March 23, 2026
కందుకూరులో వ్యభిచారం.. మహిళలు అరెస్ట్

ప్రకాశం జిల్లాలో వ్యభిచారం చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. కందుకూరు పట్టణం ఉప్పుచెరువు ప్రాంతంలోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందని ఎస్ఐ పులి శివ నాగరాజుకు సమాచారం అందింది. తన సిబ్బందితో ఆదివారం దాడి చేశారు. వ్యభిచారం నిర్వహిస్తున్న ఐదుగురు మహిళలు, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. వారిపై కేసు నమోదు చేశారు.
News March 23, 2026
చీమకుర్తిపై యుద్ధం ఎఫెక్ట్..!

ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో గ్రానైట్ ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. దీనికి యుద్ధం తోడు కావడంతో చీమకుర్తిలోని గ్రానైట్ పరిశ్రమలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. యుద్ధం నేపథ్యంలో ఇండస్ట్రియల్ డీజిల్ ధరలు పెరగడంతో ఈ పరిశ్రమల కష్టాలు మరింత పెరిగాయి. క్వారీల్లో భారీ యంత్రాలకు ఈ డీజిల్ చాలా అవసరం. దీనిపై సబ్సిడీలు ఇస్తేనే గ్రానైట్ రంగం గట్టెక్కుతుందని పలువురు కోరుతున్నారు.


