News November 30, 2025
వేంపల్లె: 10 రోజుల్లో డెలివరీ.. అంతలోనే విషాదం.!

ఎన్నో ఆశలు.. ఆవిరైపోయాయి. మరో 10 రోజుల్లో కుటుంబంలోకి ఇంకొకరు చేరుతారని కలలుకన్నారు. కానీ ఆ కలల కన్నీళ్లను మిగిల్చాయి. ఈ విషాదకర ఘటన వేంపల్లిలోని పుల్లయ్య తోటలో చోటు చేసుకుంది. భూదేవి(27) అనే గర్భిణీ తన ఇంటి రెండో అంతస్తులో నుంచి కింద పడి మృతిచెందింది. అదే సమయంలో గర్భంలోని శిశువు కూడా మృతి చెందింది. దీంతో ఆ కుటుంబమే కాదు.. గ్రామస్థులు, ఈ విషయం విన్న ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతమవుతున్నారు.
Similar News
News March 23, 2026
మార్క్ ఫెడ్ కొన్నది గోరంత.. కొనాల్సింది కొండంత.!

కడప జిల్లాలో రబీలో వాతావరణం అనుకూలించడంతో 88,114 హెక్టార్లలో శనగ పంట సాగు జరిగింది. ఎప్పుడూ లేని విధంగా హెక్టారుకు 25 క్వింటాళ్లు దిగుబడి వచ్చింది. పంట చేతికొచ్చాక మార్కెట్లో రేటు పడిపోయింది. దాంతో ప్రభుత్వం రూ.5,875లు MSP ప్రకటించింది. జిల్లాలో మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేపట్టింది. ఇప్పటి వరకు కేవలం 13,460MTలు మాత్రమే కొనుగోలు చేశారు. ఇంకా కొనుగోలు చేయాల్సిన పంట రైతుల వద్ద చాలా ఉంది.
News March 23, 2026
కడప ఆర్డీఓగా మురళీ బాధ్యతలు

కడప నూతన ఆర్డీవోగా ఏ.మురళీ బాధ్యతలు స్వీకరించారు. నెల్లూరు జిల్లాలో పీఏ టూ స్పెషల్ కలెక్టర్గా పనిచేసిన ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వం ఆర్డీవోగా నియమించింది. పూర్వపు ఆర్డీవో జాన్ ఎర్విన్ బదిలీ కావడంతో ఈ నియామకం జరిగింది. సోమవారం ఉదయం 6.30 గంటలకు బాధ్యతలు చేపట్టిన ఏ. మురళీని కార్యాలయ అధికారులు అభినందించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెవెన్యూ సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.
News March 23, 2026
కడప ఆర్డీఓగా మురళీ బాధ్యతలు

కడప నూతన ఆర్డీవోగా ఏ.మురళీ బాధ్యతలు స్వీకరించారు. నెల్లూరు జిల్లాలో పీఏ టూ స్పెషల్ కలెక్టర్గా పనిచేసిన ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వం ఆర్డీవోగా నియమించింది. పూర్వపు ఆర్డీవో జాన్ ఎర్విన్ బదిలీ కావడంతో ఈ నియామకం జరిగింది. సోమవారం ఉదయం 6.30 గంటలకు బాధ్యతలు చేపట్టిన ఏ. మురళీని కార్యాలయ అధికారులు అభినందించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెవెన్యూ సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.


