News December 1, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> కొమురవెల్లి ఛైర్మన్ పదవిపై డిమాండ్ బీసీ నాయకుల అరెస్ట్
> వెల్ది గ్రామ సర్పంచ్గా సింగిరెడ్డి సునీత ఏకగ్రీవం
> పాలకుర్తి: కాంగ్రెస్లో చేరిన పలువురు బీఆర్ఎస్ నేతలు
> ఎలక్షన్ కోడ్ ఉన్నంత వరకు ప్రజావాణి రద్దు: కలెక్టర్
> రఘునాథపల్లి: నామినేషన్ వేయని 7 గ్రామపంచాయతీ వార్డు మెంబర్ల స్థానాలు
> నామినేషన్ క్లస్టర్ గ్రామపంచాయతీలను పరిశీలించిన డీసీపీ
Similar News
News March 16, 2026
వడగాల్పులపై అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్

అనంతపురం జిల్లా రెవెన్యూ భవన్లో ‘వేసవి వడగాల్పుల కార్యచరణ ప్రణాళిక-2026’పై కలెక్టర్ ఆనంద్ సమీక్ష నిర్వహించారు. వడదెబ్బ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. జిల్లాలో 534 చలివేంద్రాలు ఏర్పాటు చేసి తాగునీరు, మజ్జిగ అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు మధ్యాహ్నం ఎండలో తిరగకుండా జాగ్రత్తలు పాటిస్తూ ఎక్కువగా నీరు, మజ్జిగ తీసుకోవాలని సూచించారు.
News March 16, 2026
కర్నూలు జిల్లాలో మొదటి రోజే 1042 మంది విద్యార్థులు గైర్హాజరు

కర్నూలు జిల్లా వ్యాప్తంగా సోమవారం జరిగిన పదో తరగతి పరీక్షల్లో 1042 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈవో సుధాకర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 35851 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షకు హాజరు కావలసి ఉండగా.. 34809 మంది విద్యార్థులు హాజరయ్యారు. 702 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సిందిగా 650 మాత్రమే హాజరయ్యారు. 52 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు.
News March 16, 2026
ఫిర్యాదుదారులకు చట్టపరిధిలో న్యాయం చేస్తాం: SP

నంద్యాల జిల్లా బొమ్మలసత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 75 ఫిర్యాదులు వచ్చాయని ఎస్పీ సునీల్ షొరాణ్ తెలిపారు. ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని సంబంధిత అధికారులను ఆదేశించారు.


