News December 1, 2025

KNR: ఓటర్లను ఆకర్షిస్తున్న ఆశావహులు.. సిటీలోని జాబర్స్‌కు ఫోన్ కాల్స్

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా జరగనున్న సర్పంచ్ ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రచారం జోరు అందుకుంది. ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. గ్రామంలోని ఓటర్లు ఉద్యోగం, వ్యాపారం రీత్యా నగరాల్లో ఉండటంతో, అభ్యర్థులు వారికి ఫోన్ కాల్స్ చేసి తమకు మద్దతు తెలపాలని కోరుతున్నారు. మరోవైపు గ్రామంలో కూడా ఆశావహులు ఇప్పటికే సమావేశాలు నిర్వహిస్తున్నారు.

Similar News

News March 13, 2026

మెడికల్ ఆఫీసర్ల పోస్టులకు UPSC నోటిఫికేషన్

image

కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కింద వివిధ ప్రభుత్వ విభాగాల్లోని మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి UPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1,358 పోస్టులు కాగా ఇందులో సెంట్రల్ హెల్త్ సర్వీసెస్‌లో 864 పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు రైల్వే, ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్, ఢిల్లీ కార్పొరేషన్‌లో 494 ఖాళీలు ఉన్నాయి. UPSC <>సైట్‌లో<<>> MAR 31 సాయంత్రంలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 2న పరీక్ష ఉంటుంది.

News March 13, 2026

మెదక్: ఇంటర్ పరీక్షలకు 98.12 % హాజరు

image

మెదక్ జిల్లాలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. జనరల్ విభాగంలో 4,801 మందికి గాను 4,711 మంది, ఒకేషనల్ విభాగంలో 267 మందికి గాను 262 మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లావ్యాప్తంగా 98.12 శాతం హాజరు నమోదైందని అధికారి మాధవి తెలిపారు. నేటితో జనరల్ విభాగం పరీక్షలు పూర్తయ్యాయని, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని ఆమె పేర్కొన్నారు.

News March 13, 2026

సింహాచలం వెళ్తున్న వారికి గుడ్‌న్యూస్

image

సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం సెల్ఫ్ సర్వీస్ కియోస్క్‌లు ప్రారంభమయ్యాయి. ఈ యంత్రాల ద్వారా భక్తులు క్యూలో నిల్చునే పనిలేకుండా QR కోడ్ స్కాన్ చేసి క్షణాల్లో దర్శన టికెట్లు పొందవచ్చు. కొండపైన గల బస్టాండ్, PRO కార్యాలయ ఆవరణలో వీటిని ఏర్పాటు చేశారు. ఈ సేవలను EO వెంకట్రావు శుక్రవారం ప్రారంభించారు. భక్తులకు వేగంగా దర్శన భాగ్యం కల్పించడమే తమ లక్ష్యంగా ఆయన పేర్కొన్నారు.