News December 1, 2025
తుఫాను నేపథ్యంలో తిరుపతి ఎస్పీ భద్రత సూచనలు

దిత్వా తుఫాను ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తిరుపతి ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు తెలిపారు. అరణియార్ రిజర్వాయర్లో నీటి మట్టం 1.6 TMCకు చేరుకోవడంతో పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించారు. వాగులు, వంకలు, బ్రిడ్జిల వద్దకు వెళ్లరాదని, ప్రవాహ ప్రాంతాల్లో వాహనాలు నడపవద్దని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 8099999977 లేదా 112కు కాల్ చేయాలని ప్రజలను కోరారు.
Similar News
News March 23, 2026
ఎన్పీడీసీసీఎల్కు ప్రతిష్ఠాత్మక పురస్కారం

ప్రతిష్టాత్మక గవర్నెన్స్ నౌ 12వ PSU అవార్డు 2026 ఆపరేషనల్ ఎక్సలెన్స్, ఆటోమేషన్ డిజిటల్ టెక్నాలజీలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఎన్పీడీసీసీఎల్కు వరించిందని సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. ఈ అవార్డును ఇటీవల న్యూ ఢిల్లీలో కంపెనీ తరఫున అందుకున్న కంపెనీ సెక్రటరీ కె.వెంకటేశం సోమవారం కంపెనీ డైరెక్టర్లు, సీఈల సమక్షంలో సీఎండీకి అందించారు.
News March 23, 2026
కీలక బిల్లు: విద్వేష ప్రసంగాలు చేస్తే 7 ఏళ్ల జైలు

TG: విద్వేష ప్రసంగాలు చేసేవారి భరతం పట్టేలా కీలక బిల్లును GOVT ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఇలాంటి ప్రసంగాలు చేస్తే తొలిసారి ₹50000 జరిమానా, 7 ఏళ్ల జైలు విధిస్తారు. రెండోసారి కూడా చేస్తే ₹1 లక్ష జరిమానా, 10 ఏళ్లు జైలు తప్పదు. ఇప్పటికే ఇలాంటి చట్టం కర్ణాటకలో ఉంది. కాగా పేరెంట్స్ను నిర్లక్ష్యం చేసే ఉద్యోగుల వేతనం నుంచి 10-15% కట్ చేసి వారికి అందించేలా మరో బిల్లునూ త్వరలో పెట్టనున్నారు.
News March 23, 2026
ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు: కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సింగరేణి, గిరిజన ఆశ్రమ పాఠశాలల్లోని పరీక్షా కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షలు పారదర్శకంగా, క్రమశిక్షణతో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.


