News April 18, 2024

తండ్రీకుమారులకు సవాలుగా మారిన ‘చింద్వారా’

image

మధ్యప్రదేశ్‌లో చింద్వారా లోక్‌సభ స్థానాన్ని BJP, కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ Ex CM కమల్‌నాథ్ కుమారుడు నకుల్ నాథ్ పోటీ చేస్తున్నారు. 2019లో ఆయన 37,356 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నకుల్‌ను ఈసారి ఓడించి గిరిజన జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఒకటైన చింద్వారాను కైవసం చేసుకోవాలని BJP వ్యూహాలు పన్నుతోంది. ఈ సీటును ఎలాగైనా నిలబెట్టుకోవాలని నాథ్‌లు తీవ్రంగా యత్నిస్తున్నారు.

Similar News

News November 5, 2025

నేడు తులసి పూజ ఎందుకు చేయాలి?

image

కార్తీక పౌర్ణమి రోజునే తులసీ మాత భూమిపైకి వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈరోజు తప్పకుండా తులసికి గంగాజలంతో పూజ చేయాలంటారు పండితులు. ఫలితంగా భోగభాగ్యాలు కలుగుతాయని నమ్మకం. తులసి కోట వద్ద దీపారాధన చేసి, దీపదానం చేస్తే.. లక్ష్మీ దేవి సంతోషించి, కటాక్షాన్ని ప్రసాదిస్తుందట. అంతేకాక, పసుపు పూసిన నాణాన్ని ఎరుపు వస్త్రంలో ఉంచడం వలన కుటుంబంలో సంపదలు పెరిగి, అందరూ ఆరోగ్యంగా ఉంటారని నమ్మకం.

News November 5, 2025

అనూరాధ కార్తెలో అనాథ కర్రయినా ఈనుతుంది

image

అనూరాధ కార్తె(నవంబర్) సమయంలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. ఈ కాలంలోని అనుకూలమైన వాతావరణ పరిస్థితులు, ముఖ్యంగా వర్షాలు, వ్యవసాయానికి ఎంతగానో తోడ్పడతాయి. సాధారణంగా ఫలవంతం కాని లేదా పనికిరాని మొక్క (కర్ర) కూడా ఈ కార్తెలో విపరీతమైన దిగుబడిని ఇస్తుందని.. ఈ సమయంలో రైతులు మంచి పంట దిగుబడిని ఆశించవచ్చనే విషయాన్ని ఈ సామెత నొక్కి చెబుతుంది.

News November 5, 2025

కార్తీక పౌర్ణమి.. ఈరోజు ఉపవాసం ఉండాలా?

image

కార్తీక పౌర్ణమి ఎంతో విశిష్టమైనది. ‘ఇవాళ తె.జా.4.52-ఉ.5.44 మధ్య నదీ స్నానం చేసి, వెంటనే కార్తీక దీపాలు వదలాలి. ఉపవాసం ఉండాలి. ఆహారం తీసుకోకుండా ఉండలేనివారు పాలు, పండ్లు తీసుకోవడం మేలు. సత్యనారాయణస్వామి కథ వినడం లేదా చదవడం శుభప్రదం. సాయంత్రం శివాలయాలు, విష్ణు మందిరాల్లో 365వత్తులతో దీపారాధన చేయాలి. ఇందుకు సా.5.15-రా.7.05 మధ్య మంచి సమయం. దీపారాధన తర్వాత ఉపవాసం విరమించాలి’ అని పండితులు చెబుతున్నారు.