News December 1, 2025
వనపర్తి: 35 ఏళ్లుగా ఉపసర్పంచ్గా ఊసిరెడ్డి

అమరచింత మండలం ఈర్లదిన్నె గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. గ్రామానికి చెందిన మోరెడ్డి వంశీయులు 35 ఏళ్లుగా ఉప సర్పంచ్గా కొనసాగారు. గ్రామానికి చెందిన మోరెడ్డి ఊసిరెడ్డి 35 ఏళ్లుగా ఏకగ్రీవంగా ఉపసర్పంచిగా ప్రజలు ఎన్నుకున్నారు. ఈసారి వయసు మీద పడడంతో ఆయన పదవికి ఆసక్తి చూపలేదు. 35 ఏళ్లుగా సర్పంచి ఉపసర్పంచ్ పదవికి చుక్క, మోరెడ్డి వంశీలే ఉండడం విశేషం.
Similar News
News December 3, 2025
ఈ పేరున్న వారికి అదృష్టం వరించింది!

తిరుమల వైకుంఠ ద్వార దర్శనాల ఈ-డిప్లో మొత్తం 1.76 లక్షల మందికి అవకాశం లభించింది. టోకెన్లు పొందిన భక్తుల లిస్టు రిలీజ్ చేయగా ఓ ఇంట్రెస్టింగ్ విషయం వెలుగు చూసింది. ఇందులో వెంకట్& వెంకటేశ్ & శ్రీనివాస్ అనే పేర్లున్న వారే 12,099 మంది ఉన్నారు. అలాగే 10,474 మంది లక్ష్మీ, పద్మావతి &పద్మ అనే పేర్లున్నవారు ఉండటం విశేషం. తిరుమలేశుడి పేరున్నా తమకు అవకాశం రాలేదని మరికొందరు నిరాశ చెందుతున్నారు.
News December 3, 2025
యువతకు నైపుణ్యంపై పార్లమెంట్లో ఎంపీ హరీష్ గళం

కోనసీమ జిల్లా యువతకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలు పెంచాలని అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి లోకసభలో 377 ద్వారా కోరారు. జిల్లా యువత ఆకాంక్షలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి సౌకర్యాలను విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా స్థాయిలో తగిన శిక్షణా కేంద్రాలు లేకపోవడంతో విద్యార్థులు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి యువతకు మద్దతు ఇవ్వాలని కోరారు.
News December 3, 2025
చిట్యాల: ఇంటి పన్ను వసూళ్లు రికార్డు

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చిట్యాల మండలంలోని 18 గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్ను వసూళ్లు భారీగా పెరిగాయి. మొత్తం రూ. 13,97,355 వసూలు అయినట్లు ఎంపీడీవో జయలక్ష్మి తెలిపారు. అత్యధికంగా వెలిమినేడులో రూ. 2,70,575 వసూలు కాగా, బొంగోనిచెరువు, గుండ్రాంపల్లిలలో కూడా భారీగా పన్నులు వసూలయ్యాయి. ఎన్నికల కారణంగానే ఈ స్థాయిలో వసూళ్లు పెరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.


