News December 1, 2025

కడప: 10 రోజుల్లో డెలివరీ.. అంతలోనే విషాదం.!

image

ఎన్నో ఆశలు.. ఆవిరైపోయాయి. మరో 10 రోజుల్లో కుటుంబంలోకి ఇంకొకరు చేరుతారని కలలుకన్నారు. కానీ ఆ కలల కన్నీళ్లను మిగిల్చాయి. ఈ విషాదకర ఘటన వేంపల్లిలోని పుల్లయ్య తోటలో చోటు చేసుకుంది. భూదేవి(27) అనే గర్భిణీ తన ఇంటి రెండో అంతస్తులో నుంచి కింద పడి మృతిచెందింది. అదే సమయంలో గర్భంలోని శిశువు కూడా మృతి చెందింది. దీంతో ఆ కుటుంబమే కాదు.. గ్రామస్థులు, ఈ విషయం విన్న ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతమవుతున్నారు.

Similar News

News March 22, 2026

జిల్లాలో 265 ఎకరాల్లో పంట నష్టం

image

జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలు, వడగళ్ల వానలకు జరిగిన పంట నష్టాన్ని వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. అధికారులు క్షేత్రస్థాయిలో జరిపిన పరిశీలనలో 7 గ్రామాల్లోని 190 మంది రైతులకు చెందిన సుమారు 265 ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు గుర్తించారు. బాధితులకు ప్రభుత్వం ద్వారా తగిన సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు వెల్లడించారు.

News March 22, 2026

ఖమ్మం: సర్కారు దవాఖానాల్లో తగ్గుతున్న ప్రసవాలు!

image

ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ వైద్యంపై పర్యవేక్షణ లోపం గర్భిణులను ప్రైవేటు బాట పట్టిస్తోంది. గత ఏడాది సర్కారు ఆస్పత్రుల్లో కేవలం 6,316కాన్పులే జరగగా, ప్రైవేటులో ఆ సంఖ్య 7,789కి చేరడం గమనార్హం. వీటిలో అధిక శాతం సిజేరియన్లే కావడం ఆందోళన కలిగిస్తోంది. సాధారణ ప్రసవాలు పెంచాలని కలెక్టర్ ఆదేశిస్తున్నా, క్షేత్రస్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యం వల్ల పరిస్థితిలో మార్పు రావడం లేదు. దీంతో పేదలకు వైద్యభారం తప్పడం లేదు.

News March 22, 2026

సిద్దిపేట జిల్లాలో కొండెక్కిన చికెన్ ధరలు

image

సిద్దిపేట జిల్లాలో చికెన్ ధరలు అమాంతం పెరగడంతో మాంసం ప్రియులపై భారం పడుతోంది. ప్రస్తుతం డ్రస్డ్ చికెన్ కిలో రూ.307 ఉండగా, స్కిన్‌లెస్ చికెన్ రూ.350 వరకు విక్రయిస్తున్నారు. ఎండల తీవ్రత, పెళ్లిళ్ల సీజన్ కారణంగా డిమాండ్ పెరగడమే ఇందుకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. అంతర్జాతీయ పరిణామాల ప్రభావం పౌల్ట్రీ రంగంపై పడటంతో ధరలు పెరిగాయని, ప్రాంతాలను బట్టి స్వల్ప మార్పులు ఉండవచ్చని నిపుణులు పేర్కొన్నారు.