News April 18, 2024

సారపాక ఐటీసీ గెస్ట్ హౌస్కు చేరుకున్న గవర్నర్

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గురువారం జరగనున్న రామయ్య మహా పట్టాభిషేకం
మహోత్సవంలో పాల్గొనడానికి వచ్చిన గవర్నర్ సిపి రాధాకృష్ణన్ బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటిసి విశ్రాంతి భవనానికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు పోలీస్ గౌరవ వందనం సమర్పించారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భద్రాచలం చేరుకున్నారు.

Similar News

News April 22, 2025

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 694 మందిపై కేసు నమోదు

image

ఖమ్మం: డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడిన 673 మందితో పాటు 21 మంది మైనర్ల డ్రైవర్ల పై కేసు నమోదు చేసినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఓ ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ నెలలోని 20 రోజుల్లో ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని చెప్పారు. మద్యం సేవించి వాహనాల నడుపుతూ పట్టుపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News April 22, 2025

KMM: ఉద్యోగం ఇప్పిస్తానని మోసం.. సైబర్ నేరస్థుడు అరెస్ట్

image

ఉద్యోగం ఇప్పిస్తానని పలువురిని మోసం చేసిన ఓ సైబర్ నేరస్థుడిని అరెస్ట్ చేసినట్లు సైబర్ DSP పనిందర్ తెలిపారు. DSP కథనం ప్రకారం.. నిందితుడు MK తమిళగన్ మరికొంతమంది నిందితులతో కలిసి ఆన్‌లైన్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని బాధితుల నుంచి రూ.9,25,575 నగదును తీసుకొని మోసం చేశాడు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్ నిమిత్తం ఖమ్మం కోర్టులో హాజరు పరిచినట్లు పేర్కొన్నారు.

News April 22, 2025

ఎఫ్ఏక్యూ ప్రమాణాలు పాటిస్తూ ధాన్యం కొనుగోలు: అదనపు కలెక్టర్

image

KMM: యాసంగి పంట కొనుగోలు కేంద్రాల్లో తప్పనిసరిగా భారత ఆహార సంస్థ నిర్దేశించిన ఎఫ్ఏక్యూ ప్రమాణాలు పాటించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం అదనపు కలెక్టర్, కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలుపై రైస్ మిల్లర్లు, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. రైస్ మిల్లుల వద్ద ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు తరుగు తీయడానికి వీలు లేదని సూచించారు.

error: Content is protected !!