News December 1, 2025
కృష్ణా: నవోదయలో 21 మంది విద్యార్థులు సస్పెండ్.. కారణమిదే.!

వేలేరు నవోదయ విద్యాలయంలో 8వ తరగతి చదువుతున్న 21 మంది విద్యార్థులు అర్ధరాత్రి సాహసం చేసి సస్పెండయ్యారు. రాత్రి 10 గంటల తర్వాత హాస్టల్లోని ఎగ్జిట్ ఫ్యాన్ బెజ్జం తీసి, చిన్న రంధ్రం గుండా బయటపడ్డారు. హనుమాన్ జంక్షన్-నూజివీడు రోడ్డుకు వెళ్లి బిర్యానీ తెచ్చుకున్న ఈ విద్యార్థులను గుర్తించిన ప్రిన్సిపల్ తీవ్రంగా స్పందించి, వారిని తాత్కాలికంగా సస్పెండ్ చేసి ఇళ్లకు పంపినట్లు తెలిపారు.
Similar News
News March 7, 2026
ఇరాన్ ఆయుధ నిల్వలు అడుగంటాయా?

ఇరాన్ ఆయుధ నిల్వలు అడుగంటాయని అమెరికా చెబుతోంది. 2 రోజులుగా ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై దాడులు తగ్గాయని అంటోంది. క్షిపణి దాడులు 90 శాతం, డ్రోన్ దాడులు 83 శాతం తగ్గినట్లు వైట్హౌస్ పేర్కొంది. మరోవైపు ఇరాన్ వద్ద కేవలం 1,000 బాలిస్టిక్ మిసైళ్లు మాత్రమే ఉండొచ్చని యూరేషియా గ్రూప్ ప్రెసిడెంట్ ఇయాన్ బ్రెమ్మర్ అంచనా వేశారు. యుద్ధం మొదట్లో మాదిరి ఇప్పుడు పెద్ద సంఖ్యలో డ్రోన్ దాడులు చేయట్లేదని చెప్పారు.
News March 7, 2026
ఫీజుల పేరిట హాల్ టికెట్లు ఆపితే చర్యలు: డీఈవో

పదో తరగతి విద్యార్థుల హాల్ టికెట్లను ఫీజుల బకాయిల నెపంతో నిలిపివేయవద్దని డీఈవో గిరిరాజ్ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలను ఆదేశించారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని పాఠశాలలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశామని తెలిపారు. నిబంధనలు అతిక్రమించి విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లను కూడా పరీక్షా కేంద్రాల్లో అనుమతిస్తామన్నారు.
News March 7, 2026
ఒక్క ఓటీపీతో రూ.2.90 లక్షలు మాయం

అమలాపురంలో బ్యాంక్ రుణం పేరుతో జరిగిన ఆన్లైన్ మోసంలో బావ, బావమరిది రూ.2.90 లక్షలు పోగొట్టుకున్నారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. కొంకాపల్లికి చెందిన వెంకటేశ్, దుర్గాప్రసాద్ను సాయికుమార్ అనే వ్యక్తి నమ్మించి ఓటీపీలు అడిగి క్రెడిట్ కార్డు ద్వారా నగదు దోచుకున్నాడు. దీనిపై టౌన్ CI వీరబాబు దర్యాప్తు చేపట్టారు. గుర్తు తెలియని వ్యక్తులకు ఓటీపీలు చెప్పవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.


