News December 1, 2025
అధ్యక్షా.. RDTని రక్షించండి!

నేటి నుంచి పార్లమెంట్ శీతాకాలం సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి అనంతపురం నుంచి అంబికా లక్ష్మీనారాయణ, పార్థసారథి ఎంపీలుగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆర్డీటీకి FCRA రెన్యువల్ విషయంపై వారు గళమెత్తాలని ప్రజలు ఆశిస్తున్నారు. రాయదుర్గం, అనంత, హిందూపురంలో రైల్వే సమస్యలు.. అరటి, మొక్కజొన్న పంటలకు మద్దతు ధర, ధర్మవరంలో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు, వేగవంతంపై ఎంపీలు గొంతు విప్పాల్సిన అవసరముంది.
Similar News
News March 15, 2026
మీ ఎంపీనే డ్రగ్స్ పార్టీలో దొరికిపోయారు: వైసీపీ

AP: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని ఓ ఫామ్హౌస్లో జరిగిన <<19386182>>డ్రగ్స్ పార్టీలో<<>> టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్ పట్టుబడ్డారని వైసీపీ ట్వీట్ చేసింది. టీడీపీ డ్రగ్స్ మాఫియా తెలుగు రాష్ట్రాల్లో యువత భవిష్యత్ను నాశనం చేస్తోందని మండిపడింది. ‘మీ ఎంపీనే డ్రగ్స్ పార్టీలో దొరికిపోయారు. ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు హోంమంత్రి’ అంటూ అనిత, చంద్రబాబు, పవన్, లోకేశ్ను ట్యాగ్ చేసింది.
News March 15, 2026
పటాన్చెరు: తల్లి, ముగ్గురు పిల్లలు MISSING

పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో తల్లి ముగ్గురు పిల్లలతో అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. జహీరాబాద్కు చెందిన మహేందర్ రుద్రారం గీతం యూనివర్సిటీ సమీపంలో కూలీ పనులు చేస్తూ నివసిస్తున్నాడు. 12న భార్య కనకమ్మతో గొడవ జరిగింది. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి కనకమ్మతో పాటు పిల్లలు సందీప్(8), హరీశ్(6), ఆకాశ్(4) కనిపించలేదు. శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 15, 2026
భూపాలపల్లి: రాయితీపై రైతులకు జిప్సం పంపిణీ

భూపాలపల్లి: జిల్లాలోని రైతులకు సబ్సిడీపై జిప్సం పంపిణీ చేయనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు తెలిపారు. జిప్సం వాడకం వల్ల సౌడు భూముల స్వభావం మారి, నేలలో కాల్షియం, సల్ఫర్ పెరుగుతాయని పేర్కొన్నారు. రైతులు గ్రూపులుగా ఏర్పడి ఒక టన్నుకు కేవలం రూ. 566 చెల్లిస్తే, 90 శాతం రాయితీతో సరఫరా చేస్తామని వివరించారు. ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.


