News December 1, 2025
ఖమ్మం: నేటి నుంచి కొత్త వైన్స్.. ఎన్నికల జోష్

ఖమ్మం జిల్లాలో ఈరోజు నుంచి నూతన ఎక్సైజ్ పాలసీ కింద 116 వైన్స్ ప్రారంభం కానున్నాయి. అయితే, జనావాసాల్లో షాపుల ఏర్పాటుపై స్థానికుల నుంచి తీవ్ర అభ్యంతరాలు, ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో జమ్మిబండ వైన్స్ రద్దు కాగా, మరికొన్నింటిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. మరొకవైపు ఈ నెలలో3 విడతలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనుండటంతో, వైన్స్ వ్యాపారులు తొలి నెలలోనే అమ్మకాలు జోరుగా సాగనున్నాయి.
Similar News
News March 14, 2026
ఖమ్మం: ఎస్సీ సబ్సిడీ పథకాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఖమ్మం జిల్లాలో 2025–26 ఎస్సీ యాక్షన్ ప్లాన్ కింద సబ్సిడీ పథకాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఈ నెల 17 నుంచి 24 వరకు tsobmms.cgg.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ పంపుల పంపిణీలో గిగ్ కార్మికులకు ప్రాధాన్యత ఉంటుందని, అర్హులైన ఎస్సీ యువత అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
News March 14, 2026
ఖమ్మంలో ఆర్టీసీ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ దరఖాస్తులు

టీజీఎస్ ఆర్టీసీ ఖమ్మం రీజియన్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆర్ఎం సరీరామ్ తెలిపారు. బీఎస్సీ, బీకాం, బిబిఏ, బీసీఏ, బీఏతో పాటు ఇంజనీరింగ్ డిప్లమా పూర్తి చేసిన అభ్యర్థులు అప్రెంటిషిప్కు అర్హులని చెప్పారు. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని సూచించారు.
News March 14, 2026
వలస కార్మికుల వివరాలపై కేంద్రాన్ని కోరిన ఎంపీ రఘురాంరెడ్డి

విదేశాల్లో ఉపాధి పొందుతున్న తెలంగాణ వలస కార్మికుల గణాంకాలను వెల్లడించాలని ఎంపీ రఘురాంరెడ్డి లోక్సభలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రం నుంచి వెళ్లిన పురుష, మహిళా కార్మికుల వివరాలతో కూడిన సమగ్ర డేటాబేస్ అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. దీనికి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గరిటా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. వలస కార్మికుల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలను వివరించారు.


