News December 1, 2025

పార్లమెంట్‌లో నినదించి.. ఈ సమస్యలు పరిష్కరించండి సార్.!

image

హైదరాబాద్-అమరావతి ఎంప్లాయిస్ రైలుతో పాటు మరికొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లకు నడికుడి జంక్షన్‌లో స్టాప్‌లు మంజూరు చేయాలని ప్రజలు MP శ్రీకృష్ణదేవరాయలను కోరుతున్నారు. ఆయన కృషి ఫలితంగానే వందే భారత్ పిడుగురాళ్లలో ఆగడానికి అధికారులు అంగీకరించారు. జాతీయ రహదారుల పనుల వేగవంతం, కేంద్ర పథకాల అమలులో MP చొరవను ప్రజలు అభినందిస్తున్నారు. నేడు పార్లమెంట్‌లో జిల్లా సమస్యలపై మాట్లాడి సమస్యలు పరిష్కరించాలన్నారు.

Similar News

News March 20, 2026

నల్గొండ: 20 రోజుల్లోనే రూ.30 పెంపు.. బెంబేలెత్తుతున్న జనం

image

పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధ మేఘాలు జిల్లాలోని వంటింట్లో మంట పుట్టిస్తున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధాన్ని సాకుగా చూపుతూ వ్యాపారులు వంట నూనెల ధరలను అడ్డగోలుగా పెంచేస్తున్నారు. జిల్లాలో గత 20 రోజుల్లోనే కిలో ప్యాకెట్‌పై ఏకంగా రూ.30 వరకు పెరగడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. పామాయిల్ రూ.140కి చేరగా, పల్లీ నూనె రూ.175లకు విక్రయిస్తున్నారు. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారన్న విమర్శలున్నాయి.

News March 20, 2026

ఎన్నికల బరిలో హత్యాచార బాధితురాలి తల్లి!

image

బెంగాల్ ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో <<15698320>>హత్యాచారానికి <<>>గురైన బాధితురాలి తల్లి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. పానీహటి నుంచి కంటెస్ట్ చేయాలనుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు. గతంలో BJP తనకు టికెట్ ఆఫర్ చేసిందని చెప్పారు. ఇటీవల ఆ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించగా పానీహటి సీటును పెండింగ్‌లో పెట్టింది. దీంతో ఆమెకే టికెట్ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకోనుంది.

News March 20, 2026

ఇంద్రకీలాద్రిలో ప్రారంభమైన వసంత నవరాత్రులు

image

ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు సాయంత్రం శ్రీ గంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామివారి వెండి రథోత్సవం భక్తుల నడుమ వైభవంగా జరిగింది. ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వీకే శీనా నాయక్ రథాన్ని ప్రారంభించారు. డప్పు, భజనలు, కోలాటాలతో శివనామస్మరణ మారుమోగింది. రథం బ్రాహ్మణ వీధి, కొత్తపేట వరకు సాగింది.