News December 1, 2025

అధ్యక్షా.. కడప – బెంగుళూరు రైలు రోడ్డు కథ కంచికేనా..?

image

మదనపల్లి జిల్లా కల నెరవేరింది. కడప- బెంగళూరు రైలు రోడ్డు వేస్తామని మరిచారు. అయితే ఇవాళ పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో MP పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తన గళం వినిపించి కడప మదనపల్లి మీదుగా బెంగుళూరుకి రైల్వే రోడ్డుకు కృషి చేస్తారా ప్రజలు ఎదురుచూస్తున్నారు. రాజంపేట పరిధిలో బస్ షెల్టర్ల ఏర్పాటుపై చర్చించి, గతంలో మంజూరైన రైల్వే రోడ్డు, బస్ షెల్టర్ల ఏర్పాటుకు కృషి చేస్తారా? చూడాలి.

Similar News

News December 3, 2025

ఇప్పుడే విచారించలేం: హైకోర్టు

image

TG: పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లపై ఇప్పటికిప్పుడు విచారించేందుకు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ నిరాకరించింది. ఈ మధ్యాహ్నం అన్ని పిటిషన్లు పరిశీలించాక తేదీ ప్రకటిస్తామని తెలిపింది. కాగా పంచాయతీ రిజర్వేషన్ల కేటాయింపు సక్రమంగా జరగలేదని పలువురు హైకోర్టు సింగిల్‌ బెంచ్‌‌లో పిటిషన్లు దాఖలు చేయగా స్టే విధించేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే.

News December 3, 2025

ప్రసారభారతిలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

న్యూఢిల్లీలోని<> ప్రసారభారతి<<>>లో 29 కాంట్రాక్ట్ కాపీ ఎడిటర్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. డిగ్రీ, పీజీ డిప్లొమా( జర్నలిజం/మాస్ కమ్యూనికేషన్)ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల వారు అప్లై చేసుకోవచ్చు. ఇంగ్లిష్/హిందీతో పాటు స్థానిక భాషపై పట్టుండాలి. వయసు 35ఏళ్ల లోపు ఉండాలి. రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.35వేలు చెల్లిస్తారు.వెబ్‌సైట్: https://prasarbharati.gov.in/

News December 3, 2025

రోడ్డు ప్రమాదంలో జమాండ్లపల్లి వాసి మృతి

image

వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిర్నిబావి గ్రామానికి చెందిన పీరాల భగత్ (28) మహబూబాబాద్ జిల్లా జమాండ్లపల్లి రోడ్డుపై జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు. రైల్వే శాఖలో జూనియర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న భగత్ విధులు ముగించుకొని బుధవారం తెల్లవారుజామున ఇంటికి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. దీంతో భగత్ స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.