News December 1, 2025
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరల పెరుగుదల కొనసాగుతోంది. ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.660 పెరిగి రూ.1,30,480కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.600 ఎగబాకి రూ.1,19,600 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.4,000 పెరిగి రూ.1,96000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
Similar News
News March 26, 2026
‘వందేమాతరం’ తప్పనిసరి కాదు.. కానీ: SC

స్కూళ్లు, అధికారిక కార్యక్రమాల్లో ‘వందేమాతరం’ ఆలపించాలంటూ కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. జాతీయ గేయాన్ని పాడకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొనలేదని తెలిపింది. ఈ విషయంలో పిటిషనర్ మహమ్మద్ సయీద్ అనవసరంగా ఆందోళన చెందుతున్నారని వ్యాఖ్యానించింది. దేశభక్తిపై బలవంతం చేయలేరని పిటిషనర్ తరఫు లాయర్ వాదించగా, జాతీయ గేయం విషయంలోనూ అలా చేయలేరా అని ప్రశ్నించింది.
News March 26, 2026
రేపు సెలవు

రేపు (శుక్రవారం) శ్రీరామనవమి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సెలవు ఉండనుంది. ప్రభుత్వాలు రిలీజ్ చేసిన క్యాలెండర్ ప్రకారం శుక్రవారాన్ని పబ్లిక్ హాలిడేగా పేర్కొనడంతో స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు మూసి ఉండనున్నాయి. అటు బ్యాంకులకు సైతం సెలవు ఉంది. 28న నాలుగో శనివారం, 29న ఆదివారం కాబట్టి వరుసగా 3 రోజులు బ్యాంకులు పని చేయవు. దీంతో ఈ రోజే బ్యాంకు పనులు పూర్తి చేసుకుంటే బెటర్.
News March 26, 2026
ఇరాన్పై విరుచుకుపడండి.. నెతన్యాహు ఆదేశం

అమెరికా-ఇరాన్ డీల్ పూర్తి కాక ముందే ఇరాన్పై విరుచుకుపడాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు IDF (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్)ను ఆదేశించారు. ఇరాన్ ఆయుధ ఇండస్ట్రీలను 48 గంటల్లో నాశనం చేయాలని బంకర్ నుంచి ఆదేశాలు జారీ చేసినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. కాగా ఇరాన్ నుంచి తమకు ఎప్పటికైనా ముప్పు తప్పదని ఇజ్రాయెల్ భావిస్తోంది.


